కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.
రహస్య సూక్తులు -
* రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
* ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
* మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
* నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
* పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
* గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
* శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
* అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
* కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
* ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
* మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
* ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
* మినుములు అతిగా వాడరాదు.
* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
* చవిటి ఉప్పు మంచిది కాదు.
* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
* మలమూత్ర వేగములను ఆపరాదు .
* ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
* హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
* పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .
* సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
* రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
* మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
* స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
* బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
* నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
* భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
* మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .
* అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .
* ముక్కుతో శబ్దం చేయకూడదు .
* పళ్ళు కొరకకూడదు .
ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరొగ్య సూక్తులు - 2 .
* ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .
* రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .
* రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .
* రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .
* ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.
* స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .
* రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.
* దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.
* నిద్రనుంచి లేచిన వెంటనె మంచినీటిని సేవించరాదు. అలా త్రాగిన యెడల జలుబు చేయును . ఫలములు తీసుకున్న వెంటనె కూడా నీటిని సేవించరాదు .
* వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.
* అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.
* రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.
* బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.
* కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.
* అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.
* మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .
* నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.
* బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .
* శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .
* మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.
* సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.
* మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.
* అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.
* చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.
* భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును
పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది వెల - 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు .
కొరియర్ చార్జీలు 50 రూపాయలు కలుపుకుని మొత్తం 850 రూపాయలు .
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు గూగుల్ పే లేదా ఫొన్ పే లేదా పేటియం ఇదే నంబర్ 9885030034 కి పంపించి ఇదే నంబర్ కి whatsup నందు స్క్రీన్ షాట్ పెట్టి మీ పూర్తి అడ్రస్ పంపగలరు.
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి