8, మే 2020, శుక్రవారం

*ధ్యానం అంటే ఏమిటి..? ఎలా చేయాలి..?*


                 🔺ధ్యానం🔺
*నిద్ర ఎరుకలేని ధ్యానం*. 
*ధ్యానం ఎరుకతో నిద్ర.* 
*నిద్రలో మరిమిత శక్తిని పొందుతాం.* 
*ధ్యానంలొ అపరిమితంగ శక్తిని పొందుతాం.* 
*ఈ శక్తి మన శరీరిక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది.* 
*ఇది మన అతీంద్రియ శక్తిలిని కూడా ప్రభావితం చేస్తుంది.* 
*ధ్యానం ద్వార మనం పోందె శక్తివల్ల శారీరిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పోందుతాము.*
*మహద్భుత జ్ఞానాన్ని పోందడానికి ఏకైక మార్గం ధ్యానం*. 
*దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పోందడానికి* *ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది.* 
*ధ్యానం అంటె మరేమి కాదు. ఎరుకతో మనలోకి మనం చేసె ప్రయాణం.* 
*ధ్యానంలొ మన చైతన్య పదార్తము శరీరం నుంచి మనసుకు, మనసునించి బుద్ధికి, బుద్ధినించి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది.*

*ఇప్పుడు ధ్యానం ఎలా చేయ్యాలో తేలుసుకుందాము.*

*ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని మనసును నిలువరింపచేయాలి*. 
*అంటే శారీరిక కదలికలును, చుడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలి. ధ్యాననికి ముఖ్యమైనది ఆసనం.  స్థిరమైన, సుఖమైన ఏదైన ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి.*

*నేలమీదగాని మరే ఇతర కుర్చీలు బల్లలులాంటి వాటిమీద కుచొని కూడా చేయ్యవొచ్చు.* 
*ధ్యానం ఏ సమయములోనైన చేయ్యవొచ్చు*. 
ముఖ్యమైనది *అనుకూలంగవుండగలిగే స్థలం అయ్యి ఉండాలి.*

*హాయిగ కూచొని కాళ్ళు రెండూ ఒకదానితొ ఒకటి చేర్చి చేతివేళల్లొ వేళుంచి కళ్ళుమూసుకొని లోపలగానీ బైటగాని ఏ శబ్ధము చేయ్యకుండా ఏ మంత్రము జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చెయ్యాలి*.

*మనం కాళ్ళను కలిపి చేతివేళల్లో వేళ్ళు కలపడం ద్వార మన చుట్టూ శక్తివలయం ఏర్పడుతుంది.  మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది.* 
*కళ్ళు మనోద్వారాలు.  కాబట్టి కళ్ళురెండూ మూసికొవాలి.*

*మంత్రోచ్ఛారణగాని మరే ఇతర శబ్ధముగానీ చేయడం మనసు చేసె పని.* 
*కాబట్టి దాన్ని సంపూర్ణంగ నిలిపి వెయ్యాలి.* 
*ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమౌతుందో అప్పుడు చైతన్యము శరీర పదార్థంనుంచి మనో బుద్ధి పదార్థాలవైపు ప్రాయాణం చేస్తుంది.* 
*మనస్సు మరేమీ కాదు, ఆలొచనల పుట్ట.* 
*అనుక్షణం ఎన్నొ ఆలొచనలు మొదలౌతునే ఉంటాయి. వాటివెనుక మరెన్నో ప్రశ్నలు … తేలిసినవి, తేలియనివి.* 
*చైతన్య పదార్థాన్ని మనో బుద్ధి పదర్థాలనుంచి ఆత్మవైపు ప్రాయాణింప చేయాడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం.* 
*గమనించడం అనేది ఆత్మయోక్క ప్రక్రియ.* 
*సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్థూ ఉందాలి.* 
*ప్రయత్నపూర్వకంగా శ్వాసప్రక్రియను చేయ్యరాదు.*

*తనకు తానుగా శ్వాసప్రక్రియ జరుగుతూఉండాలి.  సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి.* 
*ఇదే ధ్యాననికి మూలము.  ఇదే ధ్యాననికి మార్గము.*

*ఆలొచనలవెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు. ఆలొచనలవెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు.*

*ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాసవైపు మరల్చాలి.*

*సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి.* 
*అప్పుడు ఆలోచనల సాంద్రత క్రమంగా తగ్గడం మొదలౌతుంది.  క్రమంగా శ్వాసపరిమాణం కూడా పలుచుబొడుతూ చిన్నదౌతూ వస్తుంది.* 
*చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుమమ్ముల మధ్య చిన్న వెలుగుగా వుండి పోతుంది.* 
*ఈ స్థితిలో ఆలోచనలు వుండవు. శ్వాస కూడా వుండదు.* 
*ఇదే ఆలోచనారహిత స్థితి.* 
*ఇదే నిర్మల స్థితి.* 
*ఇదే ధ్యాన స్థితి.* 
*ఈ స్థితిలోనే విశ్వ శక్తి మనలోకి ప్రవహించడం మొదలౌతుంది. ఎప్పుదైతె మనం అధికంగా ధ్యానం చేస్తామో  అధికంగా విశ్వ శక్తిని పొందడం జరుగుతుంది.  అలా పొందిన విశ్వ శక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది.................*

*మూలం:- spiritual reality*
*సేకరణ: ........................*

7, మే 2020, గురువారం

*🙏ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత🙏*


*పూజకోటి సమం స్తోత్రం,*     
 *స్తోత్రకోటి సమో జపః* 
 *జపకోటి సమం ధ్యానం ,*          
 *ధ్యానకోటి సమో లయః* 
 
*భావం:* 

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,
కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,
కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,
కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.

 *నాస్తి ధ్యాన సమం తీర్థం;*     
 *నాస్తి ధ్యాన సమం తపః|*   
 *నాస్తి ధ్యాన సమో యజ్ఞః*  
 *తస్మాద్యానం సమాచరేత్* 
 
*భావం:* 

ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి.        
           
                 - *వ్యాసమహర్షి*

*🧘‍♀ధ్యాన పద్ధతి🧘‍♀* 

🔸ఒకచోట కూర్చుని 
 శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి, కళ్లు రెండూ మూసుకొని,మీ లో జరుగుతున్న సహజమైన
ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమ నించాలి. 
🔸మధ్యమధ్యలో ఆలోచనలు  వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్లీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. 
🔸ఏ మంత్రమూ చెప్పరాదు. ఏ రూపాన్ని ఊహించుకో రాదు.
 🔸ఇలా చేయగా చేయగా   మీ పమనస్సులోని ఆలోచనలు  తగ్గి, ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటారు. 
🔸ఇలాగ కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అని నిమిషాలు సాధన చేయాలి. అదే కనీస సమయం. ఆపైన మీ ఇష్టం. 
🔸మీ అంతరాత్మ ప్రబోధం బట్టి ఎంత సేపైనా చేయవచ్చు

4, మే 2020, సోమవారం

మనసు అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది.


మనసు అనే పదం దాదాపు ప్రతి రోజు ఎదో ఒక విషయంలో మనం అందరం అనుకుంటూ ఉంటాము. మనిషి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదురా! వాని మనసు బాగుండాలి అని కూడ అంటూ ఉంటారు. కాని ఈ మనసు ఎక్కడ వుంది అంటే మాత్రం ఎవరికీ తెలియదు. దీనినే చాల మంది అంతరం అని కూడ అంటారు. ఇది అన్నిటికంటే చాల వేగమైనది కూడ. అది ఎలా అంటే నీవు ఏదైనా అనుకుంటే నీ మనస్సు అక్కడికి వెళుతుంది అంటారు. దీనినే మనం మనిషివి ఇక్కడే వున్నావు, నీ మనస్సు ఎక్కడో వుంది అని అంటుంటారు.
ఈ మనసు చాల చాల సున్నితమైనది. అందుకే ఇది ప్రతి చిన్న విషయానికి react అవుతుంది. మనసుకు ఓపిక చాల తక్కువ మరియు సహనం కూడ తక్కువే. కాని ఇంతటి ఓపిక, సహనం లేని మనస్సుకు ఒకే ఒక దాని ద్వార ఓపిక, సహనం, అన్నిటికి మించి ప్రశాంతత మరియు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఇక్కడ ఆనందం అంటే చాల మంది అనుకోవచ్చు, ఇప్పుడు నాకేమి ఆనందంగానే వున్నాను కదా అని. కాని ఇప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా తాత్కాలిక ఆనందం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పొందే ఆనందం వేరే ఏదైనా ఇంకొక విషయానికి మరల అది బాధపడుతుంది. ఈ ఆనందం చాలా రకాలుగా వుంది. ఈ ఆనందం ఎన్ని రకాలు అనేది బృహదారణ్యకోపనిషత్ లో చాల బాగా విశదీకరించి చెప్పారు, అది “మనుజులలో ఎవడు సకల భోగములు అనుభవించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది. దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును ఆజానదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము”. దీనిని బట్టి మనకు అర్ధమైనది ఏమిటంటే మనం ఇప్పుడు పొందే ఆనందం అసలు ఆనందమే కాదు. శాశ్వతమైన పరమానందమైన ఆనందాన్ని పొందినపుడు మాత్రమే మనం అసలు సిసలైన ఆనందాన్ని పొందిన వాళ్ళమవుతాము.

సరే కాని ఈ మనస్సు అంటే ఏమిటి, అది ఎలా వుంటుంది అంటే మాత్రం, ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరకదు కాని అది ఒకేఒక అధాత్మికలో మాత్రమె దొరుకుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే అసలు మనస్సే లేదు అని తెలుస్తుంది. ఎలా అంటే వున్నది ఒక ఈ శరీరం మరియు ఆత్మ. నిజానికి ఉండేవి ఈ రెండే, కాని ఏమైంది అంటే మనం కలిగిన భావనలను ఆ ఆత్మ (శక్తికి) కు ఒక తెరగా ఏర్పరచాము అదేలాగు అంటే మనం గుడికి వెళితే హారతికి ముందు దేవుని ప్రతిమ కనబడకుండా ముందర ఒక తెల్లటి వస్త్రాన్ని అడ్డంగా వేస్తారు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ప్రక్కకు తీస్తారో అప్పుడు దేవుని ప్రతిమ మనకు కనిపిస్తుంది అదేలాగు మనం కూడ ఇక్కడ ఒక తెరను ఏర్పరచాము, అదియే మనస్సు. ఈ మనసు ఎలా ఏర్పడింది అంటే ప్రతి రోజు ఈ శరీరం చేసే ప్రతి పనిని మరియు క్రియను మనం, నేను అనే అహంకార భావనతో చేయడం వలన ఇది ఏర్పడింది. ఈ విధంగా మనకై మనం అజ్ఞానంలో అశాశ్వతమైన మరియు నశ్వరమైన ఈ ప్రపంచంలో నావి అనే ఒకే ఒక భావనతో ఏర్పడిన తెరయే ఈ మనస్సు. ఈ విధంగా మనకై మనం ఏర్పరచిన ఈ మనస్సే ఇప్పుడు మనలను శాశించే స్థాయిలో వుంది.దీనిని మనం ఏ విధంగా అజ్ఞానంతో ఏర్పరచామో, అదే విధంగా జ్ఞానంతో నియంత్రించి మన నిర్దిష్టమైన, లక్ష్యమైన మరియు మన ధ్యేయమైన ఆ పరమాత్మునిని హృదయంలో దర్శించుకోవచ్చు. ఈ మనస్సును మనం నియంత్రించగలిగితే అదియే మనకు అసలు సిసలైన మిత్రువు లేకపోతే నీ పతనానికి అదియే మొదటి శత్రువు. చాల మంది అనుకుంటారు శత్రువులు బయట వుండారు అని, కాని అసలు శత్రువు నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న తెరయైన నీ మనస్సే నీ శత్రువు. ఇది అందరు గుర్తుంచుకోవలసిన విషయం.
ఎప్పుడైతే మనం మనలో సాత్విక గుణాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మన మనసు అంతఃకరణ శుద్ది అయి ఆ పరంధాముని జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరమాత్ముని జ్ఞానం మరియు తత్వం అర్థమవుతుందో అప్పుడు మన మనసుకు automatic గా నిదానత్వం, సరళత, ఓపిక, సహనం, నిర్మలత్వం మరియు ప్రశాంతత చేకురుతాయి. వీటి అన్నిటికి మించి పరమానందం పొందాలంటే మాత్రం జ్ఞానం ఒకటి సరిపోదు. మనం తెలుసుకున్న జ్ఞానంతో ఆ దేవదేవుడైన పరమాత్మ స్వరూపుణ్ణి నీ హృదయంలో దర్శించడం వలన మాత్రమె సాధ్యం.

నీ మనసును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు. అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని (నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని) దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది. దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.

ఈ మనస్సు గురించి రమణ మహర్షి తెలిపిన ముఖ్యమైన విషయాలు :
- వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
- మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
- ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
- మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
- వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
- లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
- ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.
👏👏👏