5, జులై 2025, శనివారం
మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF)
సువార్త స్వస్థత కూటములు:
సువార్త స్వస్థత కూటములు: స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు. ఇప్పటిదాకా కుంటి ఉండింది. కుంటీ పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ ఉండింది .గుడ్డి పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా నిజంగా జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన అప్పటివరకు కళకళలాడిన హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు. ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.ఇంకా మా దరిద్రం ,రోగాలు పోలేదేమిటి అని అడిగితే దేవుడు పరీక్ష పెడుతున్నాడు కర్రు కాలితే గదా తుప్పు వదిలేది అంటారు.మీరు ఎంతోమంది పాస్టర్ల గురించి ఎంక్వయిరీ చేయండి.షుగర్,బీపీ కాన్సర్ లు ఉంటాయి.
వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . వీరు ముఖ్యానంగా హిందూ స్త్రీలు ,పిల్లలను మతం మార్చడానికి అదేపనిగా ప్రయత్నిస్తుంటారు.కొంతమంది ఆడవారిని గూడా తీసుకువచ్చి మాకు ఇలా అద్భుతాలు జరిగాయి,జబ్బులు పోయాయి,దరిద్రం పోయింది అని మెస్మరిజం తో వారిలో ఆశ పుట్టించి కుటుంబం లో ఒకరిని ఎలాగోలా మార్చేస్తారు.ఆడవారిని మార్చేస్తే ఆమె భర్తను మరియు పిల్లలను మార్చేస్తుందని వారి నమ్మకం.ఇలా ఎంతమందిని మార్చగలిగితే వారికి వారి మినిస్ట్రీస్ నుండి అంత ప్రొమోషన్ లు ఉంటాయి . ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.మన దేశాన్ని పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి విదేశాల కుట్రతో వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .
కరోనా సెకండ్ వేవ్ లో అధికారిక లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి.ఎన్నో క్రిష్టియన్ కుటుంబాలు జీవితాంతం గుండెలు బాదుకొంటూ కన్నీటి ప్రార్ధన చేస్తూ వారికొచ్చే ఆదాయంలో 10 వ వంతు పాస్టర్లకు ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటికి వారి దారిద్య బాధలు తొలగవు. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.జాగ్రత్త : వారు మన ఇంటివైపు వస్తున్నారు అంటే శవాల నుండి ప్రేతాత్మలు మనఇంటివైపు వస్తున్నట్టే.
గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి
భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్పమో లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు
మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ లేక ఓం శ్రీ మాత్రే నమః ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.
ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.
తోమాల సేవ :-
తోమాల సేవ :-
ఈ సేవా టిక్కెట్లు ఆన్లైన్ లక్కీడిప్ లో,ఆఫ్లైన్ CRO ఆఫీసు లక్కీడిప్ కౌంటర్ ద్వారా సామాన్య భక్తులు పొందవచ్చు. పలుకుబడి కలిగిన వారు టీటీడీ బోర్డు చైర్మన్ లేదా CMO పేషీ ద్వారా..
ఈ సేవ ఖరీదు 220/- మాత్రమే. కాని గర్భగుడిలో షుమారుగా నలబై నిమిషాల పాటు స్వామి వారి ముందు కూర్చుని ఆ మూలవిరాట్టుకు పుష్ప మాలలతో అర్చక స్వాములు అలంకరించి హరతులు ఇవ్వడం చూస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. దర్శనం చేసుకుని బయటకు వచ్చినా మనం మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది.
సుప్రభాతం జరుగుతున్నంత సేపు ఈ తోమాల సేవకు వచ్చిన భక్తులను ధ్వజస్తంభం దగ్గర ఆపి తరువాత గర్భగుడిలోకి( ఆనంద నిలయం) మగ వారిని ఎడమ వైపు ఆడ వారిని కుడి వైపుగా లోపలకు పంపుతారు.ముందు ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కలిగిన భక్తులను కూర్చోబెట్టి తర్వాత ముందుగా లైన్లో వచ్చిన వారిని కూర్చోబెడతారు. మీకు అవకాశం ఉంటే స్వామి వారి ముందు గదిలో ఓ మూల నిలబడి చూస్తుంటే...ఎందుకంటే కూర్చుని చూస్తుంటే మనకు పూర్తిగా భోగ శ్రీనివాసమూర్తికి జరిగే కార్యక్రమం కనపడదు.
మగవారు పంచె తప్పనిసరి.. షర్టు మరియు బనియన్ వేసుకోకూడదు. ఆడవారు సాంప్రదాయిక దుస్తులు దరించాలి.
మంగళ,బుధ,గురువారం మాత్రమే ఈ సేవ ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏకాంతంగా నిర్వహిస్తారు.
* ఇదే విధంగా అర్చన కూడా ఉంటుంది. కాకపోతే ఈ సేవలో స్వామి వారి సహస్ర నామార్చన చదువుతారు.చివరకు హరతులు..
ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఓ ఇరవై సార్లకు పైగా సేవ చేసుకునే భాగ్యం స్వామి వారు కల్పించారు. మీరు నిరుత్సాహ పడకుండా నిరంతరం లక్కీడిప్ వేస్తునే ఉండండి.
ఒక్కటి మాత్రం నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను మీరు తన నిజమైన, ప్రియమైన భక్తుడు అని స్వామి వారు భావిస్తే మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని దగ్గరగా కూర్చోపెట్టుకుని మీతో అన్ని సేవలూ చేయించుకుంటారు.ఇది మాత్రం నిజం.
సుప్రభాతం తర్వాత..
తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు ఉత్సవమూర్తులకు... ఇంకా ఇతర విగ్రహాలకు పుష్పమాలలతోను, తులసి మాలలతోను అలంకరించే కార్యక్రమాన్నే 'తోమాలసేవ' అంటారు. భుజాల మీదినుంచి వేలాడేట్లుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని “తోళ్మలై" అంటారు. అదే “తోమాల"గా మారిందంటారు. తోళ్ అనగా భుజమని అర్థం.
ఆర్జితం చెల్లించిన భక్తులు కూడ ఈ సేవలో పాల్గొని దర్శించవచ్చు. అయితే సాయంత్రం పూట జరిగే తోమాలసేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఎవ్వరూ పాల్గొన వీలులేదు.
ఏకాంగి కాని లేదా జియ్యంగారులు పూల అరనుంచి సిద్ధంచేసిన పూలమాలను తీసికొనివచ్చి అర్చకులకు అందిస్తూ ఉండగా అర్చకులు శ్రీవారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలల్ని అలంకరిస్తారు. ఈ సేవ సుమారు అర గంటసేపు జరుగుతుంది. ఈ అరగంట మనం స్వామి వారి ముందు కూర్చోవచ్చు.
సేవ చివర కర్పూర హారతి నక్షత్ర హారతి తో తోమాల సేవ పూర్తవుతుంది..
అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🍂🥥💐🥭🍉🍁🍍🥀🍒🌹🍎
తులాభారం:-
తులాభారం:-
తమ కష్టాలు తీరి నప్పుడు, అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు తులాభారం ఇస్తామని మొక్కుకుంటారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది.
తులభారం అనేది హిందూ ఆచారం, ఇది ద్వాపర యుగం నుండి ఆచరించబడింది, తులాభరం అంటే తనను సమాన బరువు గల వస్తువులను చెల్లించడం. భక్తుల ప్రార్థనలు నెరవేరినప్పుడు దేవునికి వారి బరువుకు సమానమైనవి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు.
గతంలో బరువుకు తగ్గ వస్తువును మోసుకుని వెళ్ళి సమర్పించేవారు. ఇప్పుడు తులాభారంలో కూర్చోబెట్టి కిలో చొప్పున ఆ వస్తువు రేటు చెల్లిస్తే మీకు రసీదు ఇస్తారు.అది హుండీలో వేస్తారు.
ఇప్పుడు రేట్లు :-
రూపాలు నాణేలు kg 202/-
రెండు రూపాయల నాణేలు kg 332/-
ఐదు రూపాయల నాణేలు kg 555/-
పంచదార kg 40/-
పటికబెల్లం kg 30/-
బెల్లం kg 38/-
బియ్యం kg 41/-(చివరి నాలుగు రేట్లు మార్కెట్ ని బట్టి మారుతుంటాయి)
ఉదాహరణకు మీరు 58 kgలు ఉంటే..మీరు ఐదు రూపాయల నాణేలు మొక్కుకుంటే 58*555=32,190/
**ఈ తులాభారం మహాద్వారం నుండి లోపలకు వెళ్ళగానే ధ్వజస్తంభం ఎడమ చేతి వైపు ఉంటుంది. దీనిని ఎటువంటి టిక్కెట్ అవసరం లేదు.తులాభారం తరువాత మీరు దర్శనానికి వెళ్ళడమే..