24, ఫిబ్రవరి 2024, శనివారం

స్తోత్రాలు

 ఏ స్తోత్రం చదివితే  ఏ ఫలితం వస్తుంది... 

ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్  అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

Https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !! https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన https://https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏

లవకుశులు తర్వాత రాముని వంశం

చాలామంది కి లవకుశల తరువాత రాముడి వంశం గురించి పెద్దగా తెలియదు. రామ లక్ష్మణ భరత శత్రుఘనుల సంతానం వారి భార్యలు, గురించి విపులంగా తెలుసుకుందాం... ఆ తరువాత వారి వంశం ఎలా సాగిందో కూడా వివరిస్తాను. పోతనగారి భాగవతం లో నవమస్కందంలో కుశలవుల అనంతర రఘువంశం వివరంగా లిఖించారు. వాల్మీకి రాసిన ఆనంద రామాయణం అనే కావ్యంలో వివాహకాండలో రామలక్ష్మణభరతశత్రుఘ్నుల కుమారుల వివాహల గురించి వివరంగా చెప్పబడింది.

శ్రీరాముడు ఏకపత్నివ్రతుడు అయినప్పటికి తన కుమారులకు, తన తమ్ముళ్ల కుమారులకు ఇద్దరేసి భార్యలు ఉన్నారు.

1). శ్రీరాముడు...సీతాదేవి వీరి కుమారులలో పెద్ద కుమారుడు కుశుడు మరియు చిన్న కుమారుడు లవుడు. కుశుడు కి ఇద్దరు భార్యలు...చంపిక మరియు కుముద్వతి ఈమె నాగకన్య ఈమెకు మరో పేరు కంజాననా. వీరి కుమారుడు అతిధి ద్వారా రఘువంశం వృద్ధి చెందింది. లవుడు భార్య పేరు సుమతి. వీరి సంతానం వివరాలు తెలియరాలేదు.

2). భరతుడు ... మాండవిల పుత్రులు పుష్కరుడు, తక్షుడు.
పుష్కరుని భార్యలు కళావతి(నాగకన్య) మరియు చంచల (గంధర్వ కన్య)
తక్షుడు భార్యలు కాళిక (నాగకన్య ) మరియు చపల (గంధర్వ కన్య).

3). లక్ష్మణ... ఊర్మిళల పుత్రులు
అంగదుడు, చంద్రకేతుడు 
అంగదుని భార్యలు కంజాక్షి (నాగకన్య ),
చంద్రిక (గంధర్వకన్య )
చంద్రకేతుడు భార్యలు కంజాగ్రీ (నాగకన్య), చంద్రాసన (గంధర్వకన్య).

4). శత్రుఘ్నుడు... శృతకీర్తిల పుత్రులు సుబాహుడు మరియు శృతసేనుడు 
సుబాహుని భార్యలు కమల (నాగకన్య),
అచల (గంధర్వకన్య).
శృతసేనుడు భార్యలు మాలతి (నాగకన్య), మదనసుందరి (గంధర్వకన్య).

మొత్తం 16 మంది కోడళ్ళుకు, 120 మంది మనుమళ్లు, 24 మంది మనుమరాళ్లు కలిగారు.
వీరంతా వివిధ రాజ్యాలు స్థాపించుకుని అప్పటి భూమాండలామంతటా విస్తరించారు.

వీరందరి వివాహాలు శ్రీరాముని ఆధ్వర్యంలోనే జరిగినవి. సీతానిర్యాణానంతరం నిత్య యోగాలు యజ్ఞాలు జరిపిస్తూ కఠోర బ్రహ్మ చర్యంతో 11,000 అహోరేవ వత్సరాలు పరిపాలించాడు. అహోరేవ వత్సరాలంటే ఎమిటో తెలుసుకుందాం " ఒక రాజు ధర్మనిష్ఠతో చేసే పాలనలో ఒకరోజు.. ఒక సంవత్సరానికి సమానం". ("for a Maharaja, a person who lives in accordance with dharma, a day is equivalent to a year") అనే సూత్రం ప్రకారం రాజులు చేసిన రాజ్యపాలనని అహోరేవ వత్సరాలతో చెప్తారు. అహోరేవ వత్సరాలని 360 చేత భాగిస్తే సౌరమాన వత్సరాలు వస్తాయి. 11,000/360=30.55
అనగా శ్రీరాముడు ముప్పై సూర్యమాన సంవత్సరాలు పరిపాలించాడు.

ఇకపోతే శ్రీరాముని ప్రధమ పుత్రుడు కుశుడు ద్వారా రఘువంశం ఏవిధంగా వృధి చెందినదో పోతన భాగవతం ఆధారంగా తెలుసుకుందాం. వీరి వంశం కురుక్షేత్ర సంగ్రామం వరకు మనుగడలో ఉంది.

శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించాడు.....🙏

గరుడ పురాణం

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు.. 

గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభపురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి – ” మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః” అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .
గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి .
అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి.

ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే.
నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

గరుడ పురాణం:
⚜🔱⚜🔱⚜

గరుడుని పుట్టుక:
 ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు , బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను . ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి . అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను . అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను ,మరొకటి ఆకాశముగాను అయ్యెను.ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను . అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా “తప తప “అను మాటలు విన వచ్చెను . అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను .
బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని , దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి , వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి , మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు
 కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత ,కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె ,గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను.ఆమె సంతోష భరితురాలయ్యేను .
ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ , వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ “గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న ” దనెను. వినత ” అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?” అనెను. కద్రువ ,”కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను .తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను ” అనెను .వినత ” అయినచో పోయి చూతము రమ్మ “నెను. కద్రువ ” ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.
రేపు ప్రొద్దున చూత ” మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి ,”మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు ” డనెను . “విషయమే” మని వారడుగగా ,జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి .ఆమె వారిని సర్పయాగాములో నశింపు చసేను.

వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది .తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని
 త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు.
ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి,” మనకీ దురవస్థయే” మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి ” ఏమిచ్చినచో నీవు నా
 తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద ” నని యడిగెను. ఆమె ” దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు ” ననెను.
గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి , తన తల్లి దాస్యమును ,దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి ,ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను.
కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి ,అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి .వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో ” దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు
” మనెను. దానికి గరుడుడు ” నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును.” అనెను . ” ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె ,నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే , అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను .దీనికి నీవంగీకరింపుము” అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి , ” మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !” అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.
ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి ,” కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు.” అని చెప్పెను.
తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై “గరుడా ! నీ భక్తికి మెచ్చినాను .నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము.” అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.
గరుడుని గర్వ భంగము
 ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట ,అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.
ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.
శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను . గరుడుడా స్పర్శతో తేరుకుని , విష్ణు మూర్తి పాదములపై బడి ,” ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి ,నా


హంస

*హంస రాజస లక్షణాలున్న నీటి పక్షి. అందువల్ల రాజహంస అనీ పిలుస్తారు. సంస్కృతంలో మరాళం అంటారు. తెలుగులో తెలిపిట్ట, చక్రాంగన, శ్వేతగరుత్తు అనే పేర్లున్నాయి. భారతీయ ధర్మం హంసకు పరమోన్నత స్థానాన్నిచ్చి గౌరవించింది.* వేదకాలం నుంచి హంస గొప్పతనం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి వైదిక సాహిత్యంలోను, పురాణ కథల్లోనూ హంస ప్రస్తావన ఉంటుంది. దేవతల్లో ఒక్కొక్కరికీ ఒక్కో వాహనం ఉంది. భార్యాభర్తలైన బ్రహ్మదేవుడు, సరస్వతి ఇద్దరికీ- హంసే వాహనం.

భారతీయ ఆధ్యాత్మిక చింతనలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. వేదాల్లో హంస గాయత్రీ మంత్రం ప్రసిద్ధి చెందింది. అథర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న 31 ఉపనిషత్తుల్లో హంసోపనిషత్తు ఒకటి. వేదాలు, శాస్త్రాల్లో అత్యున్నత స్థాయికి చేరినవారిని *'పరమహంస'* అని ప్రస్తుతిస్తారు.

వేదాంత బోధనపరంగా *హంసకు విశేష స్థానం ఉంది. నీళ్లలో విహరిస్తున్నప్పటికీ హంస రెక్కలు తడవవంటారు. అలాగే సంసార సాగరంలో చిక్కుకున్నప్పటికీ, మనిషి ఏ మమకారానికీ లోనుకాకుండా జీవించాలని చెబుతారు.* హంసకు పాలను, నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. నిజానికి పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుంచి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో వదిలేస్తుందట. అలాగే మంచిచెడుల మిశ్రమమైన జీవన గమనంలో మంచిని స్వీకరించి, చెడును విడిచిపెడితే జీవితం సుసంపన్నం అవుతుందని పెద్దలు చెబుతారు. పై రెండు ఉదాహరణలకు సంకేతంగా హంసలా జీవించాలని చెబుతారు. *యోగశాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీక. లోనకు పీల్చే గాలిని (ఉచ్ఛ్వాసాన్ని) 'హం' అని, బయటకు విడిచిపెట్టే ఊపిరిని (నిశ్వాసాన్ని) ‘స’ అనీ అంటారు. అందుకే మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు 'హంస ఎగిరిపోయింది' అంటారు....🙏

21, ఫిబ్రవరి 2024, బుధవారం

🪷నానబెట్టిన అవిసె గింజలు( flax seeds): ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..!🪷

https://www.youtube.com/watch?v=Pvcp1_cAYic

🪷నానబెట్టిన అవిసె గింజలు( flax seeds): ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..!🪷

అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మలబద్ధకం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. 

అవిసె గింజలు LDL (చెడు కొలెస్ట్రాల్)ను కరిగించి, HDL (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. 

🌷అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. దిని వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను నిర్వహించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు మెరుగ్గా పనిచేస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తినే వ్యక్తుల్లో గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

🌷బీపీ కంట్రోల్లో ఉంటుంది..

అవిసె గింజలు కూడా రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అవిసె గింజలు సహాయపడతాయి. వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.

🌷క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది..!

మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజల్లో ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్నాన్స్ ఉంటాయి. ఈ గింజల్లోని ఒమెగా-3 యాసిడ్కు రొమ్ముక్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నియంత్రించే గుణం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

🌷ప్రోటిన్ స్టోర్ హౌస్..
మీరు వెజిటేరియన్స్ అయితే.. మీకు అవిసె గింజలు సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. వీటిలో ప్రోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోజూ మీ డైట్లో చేర్చుకుంటే.. ప్రోటిన్ లోపం దూరమవుతుంది.

🌷జుట్టు బలంగా..
దీనిలో ఉండే.. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని, వెంట్రుకల కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచే కొలాజెన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. అవిసె గింజలు జుట్టు ఆరోగ్యంగా ,మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో విటమిన్-బి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టుకు బలం చేకూర్చడంతో పాటు జుట్టు పొడిబారకుండా చేసి సిల్కీగా ,మెరిసేలా చేస్తుంది.

ఎలా తీసుకోవాలి..❓
వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్ చేసి, పొడిచేసుకుని తింటే మంచిది. వీటిని వేయిస్తే.. దీనిలోని హానికారక ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మొలకెత్తించి తిన్నా కూడా మంచిదే. ఈ గింజలు నీళ్లలో వేసినప్పుడు కొద్దిగా ఉబ్బి, జెల్లీలా మారతాయి . అంటే ఇవి నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే చెంచా తిన్నా, అరచెంచా తిన్నా తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. లేదంటే మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవిసెగింజల ప్రయోజనాల్ని సంపూర్ణంగా పొందవచ్చు . వీటిని పొడి రూపంలో తినాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రిజ్లో దాచిపెట్టాల్సిందే. లేదంటే పోషకాలు త్వరగా పోతాయి.

19, ఫిబ్రవరి 2024, సోమవారం

🔴బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు, సంపద వస్తుంది?

🔴బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు, సంపద వస్తుంది?

🔴బొట్టు.. బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికీ ఉన్నారు . ముఖ్యంగా వివాహితలైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏ మాత్రం మంచిది కాదని చెప్తారు.

🔴బొట్టు పెట్టుకోవటం వెనుక అనేక కారణాలు అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నింటిని చూస్తే ... పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహిత లో నుదుటిమీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని చెప్పబడింది.


🔴బ్రహ్మస్తానంలో బొట్టు పెట్టుకోవటం శుభాలకు సంకేతం అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని, ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు స్మశానంతో సమానం అని పెద్దలు చెప్తారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి.


🔴బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలివే కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమబొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది.

🔴ఈ పనులు చేసేటప్పుడు బొట్టు లేకుంటే ప్రయోజనం ఉండదు ఇవి మాత్రమే కాకుండా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి. పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు, దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు, పితృ కర్మలను ఆచరించే టప్పుడు నుదుటన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు.


🔴బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి .. ఎలా పెట్టాలంటే ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు? ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు? అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో కానీ, ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వచ్చిపడతాయి. అందుకే చూపుడువేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు.


🔴బొట్టు పెట్టుకుంటే కలిగే ఫలితం ఇదే ఇక దేవతల ప్రతిమలకు, ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు, గంధం వంటివి పెట్టాలి. పొరపాటున కూడా మధ్యవేలుతో పెట్టకూడదు. మధ్యవేలుతో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు, సంపద రెండూ వస్తాయని చెబుతారు. ఇక బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతారు. మొత్తంగా చూస్తే కచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి. మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవటం ఎంతో మంచిది.

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

జననమరణములు అంటే ఏమిటి!? - మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణం ఏమిటి!?

 జననమరణములు అంటే ఏమిటి!? - మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణం ఏమిటి!?

         ✍️ Dr. M. N. చార్య

🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


🪷 మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడిపోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే "అవస్థాషట్కము"  అని అంటారు. అవి... 

1. పుట్టుట, 2. ఉండుట, 

3. పెరుగుట, 4. మారుట, 

5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.


✳️ మనిషికి ఎన్ని అవస్థలు కలవు  


శ్లో: 

"దేహినో౬స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా! 

తథాదేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి!! 


🪷 జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి, తాను అనుభవిస్తున్నవి, సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది. 


✳️ మృత్యు భయం వీడకపోవటానికి కారణం..! 


🪷 భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం'. మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు...  ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! 


🪷 మృత్యువును గురించి నచికేతుడు యమధర్మరాజును అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్' గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం - ఏది అభౌతికమైనది అంటే......, ‘ఆత్మే' అభౌతికమైనది.  దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ' అవుతుంది. ‘జీవాత్మ' దేహత్యాగం చేస్తే ‘ఆత్మ'గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం-భూమిలోను,  అగ్నితత్వం-అగ్నిలోను, జలతత్వం-జలములోను,  వాయుతత్వం-వాయువులోను శబ్దతత్వం-ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది. 


✳️ పుట్టడం గిట్టడం అంటే ఏమిటి..?  


🪷 అసలు పుట్టటం గురించి తెలుసుకుందాం. 


🪷 సాధారణంగా మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకుముందు లేనిది ఏదో రావడం. గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం. క్రియలో రెండు వేరు వేరుగా కనపడుతున్నా.. కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండూ ఒకటే! ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు తన పూర్వావస్థ ( అంటే ఇంతకు ముందున్న స్థితి )ని వదిలి ఉత్తరావస్థ ( అంటే ఇప్పటి స్థితిని వదిలి తరువాత స్థితి )ని పొందడాన్నే పుట్టడం అంటారు. గిట్టడం అంటే కూడా అదే అర్ధం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నస్థితిని వదిలి దాని తరువాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు. 


🪷 ఉదాహరణకు..  ఒక విత్తనం తన బీజావస్థని వదిలి వృక్షావస్థకి వస్తే దానినే మనం చెట్టు మొలిచింది అంటున్నాము. అంటే .. దాని పూర్వావస్థ అయిన విత్తనస్థితి నుంచి అది చెట్టు రూపంలోకి వచ్చింది. అంటే విత్తనం "పోయింది" చెట్టు "పుట్టింది". మనం ఆ చెట్టుని కట్టెల రూపంలోకి మార్చాము అనుకోండి ఆ ఉన్నచెట్టు కాస్తా పోయింది దాని నుంచి "కట్టెలు" పుట్టాయి. ఆ కట్టెలనే మనం కాల్చాము అనుకోండి, కట్టెలు పోతాయి దాని నుంచి బొగ్గులు పుడతాయి. ఆ బొగ్గులనే మళ్ళీ కాల్చాము అనుకోండి. ఆ బొగ్గులు పోతాయి అందులోంచి బూడిద పుడుతుంది. అలా భూమిలో నుంచి పుట్టిన చెట్టు బూడిదగా మారి చివరకి మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది. ఇలా ఈ భూమి మీద ఏదైనా సరే మట్టిలోనుంచి వచ్చి చివరికి మళ్ళీ మట్టిలో కలవాల్సిందే! విత్తనంపోయి చెట్టుపుట్టింది! చెట్టుపోయి కట్టెలు పుట్టాయి, కట్టెలు పోయి బొగ్గులు పుట్టాయి, బొగ్గులు పోయి బూడిద పుట్టింది, బూడిద తిరిగి మట్టిలోనే కలిసింది.  


✳️ గతం అనేది ఒక మృత వస్తువు 


🪷 ఈ రకంగా పుట్టడం అంటే ఒక వస్తువు తన పూర్వావస్థని వదిలి ఉత్తరావస్థని (అంటే తరువాత స్థితిని) పొందడం. ఇక్కడ అవస్థ అంటే అర్ధం స్థితి అని. అంటే వస్తువు (మెటీరియల్) అదే, కాని దాని రూపం మారింది. ‘గతం' అనేది ఒక సెకండ్ క్రితం వెళ్ళిపోయింది. దాన్ని తిరిగి తీసుకోనిరావటం అంబానీ, బిల్ గేట్స్ ల వల్ల కూడా కాదు. ‘గతం' అనేది ఒక మృత వస్తువు. దానికి ప్రాణంపోసి సజీవురాలిని చేయటం అసంభవం. ఇంతవరకూ జరగలేదు, ఇక ముందర కూడా జరగదు. మరణాన్ని గురించి నిదానంగా ప్రశాంతంగా తెలుసుకోవాలి. దీన్ని గురించి తెలుసుకుందామనే తొందరపాటు ఉండకూడదు.

మృత్యువును అతి సహజంగా, హుందాగా, అంతరంగ గౌరవమర్యాదలతో చేరుకోవాలి. జననం మాదిరిగానే మృత్యువు కూడా అద్భుతమైన విషయం. మృత్యువులో కూడా సృష్టి ఉంది. సృష్టి... ఆది-అంతం లేకుండా నిరంతరం జరుగుతుండే ప్రక్రియే మృత్యువు సృష్టికి ఒక అర్ధాన్నిస్తుంది. 


✳️ గతం నుండి విముక్తే మృత్యువు 


🪷 మళ్ళీ జన్మ ఎత్తటం కావలసినవన్నీ పొందటం మృత్యువుకేమీ సంబంధం లేదు. ఆది, మధ్య, అంతం అనే స్థితులు లేని ఒక మహత్తర సృష్టి మృత్యువు.  అంటే, ఇంకా సులభంగా చెప్పాలంటే మృత్యువు మనల్ని సమీపించిన వేళ మన దగ్గర ఉన్నవన్నీ తొలగించబడుతాయి. అనుబంధాలు, డబ్బు, భార్య, పిల్లలు, దేశం, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, గురువులు, శిష్యులు, దేవుళ్ళు నిజానికి వీటన్నిటినీ గురించిన భావాలను మనతో వస్తాయనుకుంటాం కానీ అది అసాధ్యం అవన్నీ మృత్యువు తెంచేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే గతం నుండి విముక్తే (Freedom from the Known) మృత్యువు అంటే! 


🪷 అయితే,  ఇంత సహజమైన మృత్యువుని చూసి భయమెందుకంటే...  గతాన్ని మరచి పోవటానికి మనం సిద్ధంగా ఉండం. ఇంత చెబుతున్నా ఎవరైనా తమ మత విశ్వాసాలను మార్చుకుంటారా? గతం నుండి విముక్తి చెందారా? అంటే సమాధానం లేదనే చెప్పాలి. గతం నుండి విముక్తి చెందటమంటే వర్తమానంలో జీవించటం, అట్టివారికి మృత్యు భయం ఉండదు. వారు మృత్యువును, జననం అంత సహజంగా చూస్తారు. భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవించాయి కదా మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే పూర్తిగా నిరాసక్తతగా ఉండండి (Be Totally Detached) ఎందుకంటే,  మృత్యువు సమీపించినప్పుడు జరిగేది అదే.  చనిపోవటమంటే అన్నిటినీ వదులుకోవటం (To give up everything) మృత్యువు అన్నిటినుంచి మనల్ని తోసివేస్తుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే మృత్యువు అంటే,  స్వేచ్ఛగా ఉండటమే అనుక్షణం మనం శ్వాస, నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం, కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం. పునర్జన్మ అంటే ఇదే (So, Living is Dying) ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువుని చూసి భయపడటం అర్ధరహితం.  దీన్ని గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. 


✳️ నాకు అన్నీ తెలుసు అనుకుంటే పొరపాటే...


🪷 నాకు అన్నీ తెలుసు అన్న మనిషికి అసలు ఏమీ తెలియదు అనే ఒక నానుడిని మీరు కూడా వినే ఉంటారు. 'నేను భగవదానుభూతిని పొందాను, ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటో నాకు తెలుసు' - అని ఎవరైనా అంటే దాని అర్ధం,  స్టేషన్ కు వెళ్ళటానికి నాకు దారి తెలుసు సుమా అని, స్టేషన్ ఒక స్థిర ప్రదేశం దీన్ని చేరుకోవటానికి అనేక మార్గాలున్నాయి. ఈ రోజుల్లో ఒక్కక్క మార్గానికి ఒక్కక్క గురువు ఉన్నాడు. నిజానికి వాళ్ళు చెబుతున్న, 'నాకు తెలుసు, నేను చూసాను' అంటే, వాళ్ళు 'ఏదో చూసారు ఆ చూచినదానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళంతా గతంలోనే ఉన్నారు.' 


🪷 గతం,  కాలంలో కరిగిపోతుంది. అది సజీవమైంది. స్టేషన్ లాగా అది స్థిరమైన ప్రదేశం కాదు. మృత వస్తువు అంతకన్నా కాదు. విశ్వాసం నిజం కాకపోవచ్చు, అదే సత్యం కాదు కూడానేమో. కొంతమంది భగవంతుని విశ్వసించవచ్చు, కొంతమంది విశ్వసించక పోవచ్చు. ఎవరి విశ్వాసంలో వారికి ప్రామాణికతలుంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా మనం విశ్వాసాలను ఏర్పరుచుకున్నాం. మరి ఇంతకూ నిజం ఏమిటో ఎలా తెలుస్తుంది? నిజం తెలుసుకోవాలంటే మనసు స్వేచ్ఛగా ఉండాలి. విశ్వాసం, అవిశ్వాసం ఈ రెండింటిలోను దానికి తావులేదు. నిరంతరమూ అన్వేషించటమే సత్యాన్ని తెలుసుకోవటానికి మార్గం ఏదో ఒక మార్గంలో అన్వేషించాలి. ఆ మార్గం తప్పైతే మరో మార్గం! మరణభయాన్ని విశ్లేషించి చూస్తే మరణించేటపుడు పొందవలసిన దేహబాధ పెట్టే భయం కన్న మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది. ఇన్ని గ్రహించిన తర్వాత మనిషి ఎదుటి వారి మనస్సును, అంతరాత్మ పరమార్దాన్ని తెలుసుకోగాలుగుతున్నాడా!!

కర్మ - జన్మ

 శాపం సత్వర ఫలాన్ని ఇస్తుంది


కర్మ - జన్మ  మల్లాది వెంకట కృష్ణమూర్తి.


శాపం తగలడం అనేది నిజం అని ఈ కింది సంఘటన ఋజువు చేస్తోంది. ఇది మాతృవాణి ఇంగ్లీష్ పత్రికలో షామ్ భట్ అనే అతను తన స్వానుభవాన్ని ఇలా రాసాడు.


షామ్ భట్ అనే బి.ఏ విద్యార్ధి పుత్తూరు వివేకానంద కాలేజ్లో చదువుతూండగా ఆ కాలేజి ప్రిన్సిపాల్  అయిన ప్రొఫెసర్ యం. ఎస్.అప్పాతో కాలేజీ మేగజైన్ విషయంలో పోట్లాట వచ్చింది. ఆవేశంలో అప్పా ముందే ఆ మేగజైన్ని ముక్కలు ముక్కలుగా చింపిపారేసాడు. అతను కాలేజీ చదువు పూర్తయ్యాక ఏ పని ఆరంభించినా దాన్నించి సరైన ఫలాలు అందడం లేదు. ఓరోజు షామ్ భట్ మాతా అమృతానందమయి దగ్గరకి తనకి కలిగే అపజయాల గురించి చెప్పుకోడానికి వెళ్ళాడు. ఆవిడ అతనేం మాట్లాడకుండానే కాలేజీలో జరిగిన సంఘటనని గుర్తు చేసి, అతనికి గురు శాపం తగిలిందని, ఆయన్ని కలిసి తను చేసిన అపరాధానికి క్షమాపణ వేడుకోమని సలహా చెప్పింది. రెండు రోజుల తర్వాత షామ్ భట్ తన ప్రొఫెసర్ యం. ఎస్. అప్పా ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఇతన్ని చూడగానే గుర్తు పట్టాడు. షామ్ భట్ తను ఆనాడు చేసిన పనికి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికి వచ్చానని చెప్పగానే అప్పాకి అతని మీద కోపం పోయింది. "ఇన్ని రోజులు నిన్ను తలచుకుని తిట్టుకోని రోజు లేదు. ఇప్పుడు నీ మీద నాకు కోపం పోయింది." చెప్పాడు ప్రొఫెసర్. ఆ తర్వాత షామ్ భట్ కు సంపాదనలో లోపం లేకుండా పోయింది.


వారిలో మన మీద కోపం నిలిచిపోయేంత లోతుగా మనం ఎవర్నయినా బాధించి ఉంటే, వారి మనసులోని బాధ ప్రకంపనలు మనల్ని వచ్చే జన్మలో వెంటాడి తాకుతాయి. ఒకోసారి ఈ జన్మలోనే అవి వచ్చి తాకచ్చు. కాబట్టి మనం అందులోంచి విడుదలవాలి అని అనుకుంటే మాత్రం, అవకాశం ఉంటే మనం మనస్థాపం కలిగించిన వారందరి దగ్గరకి వెళ్ళి క్షమాపణ చెప్పడం విజ్ఞత అవుతుంది.

*నవ గ్రహదేవతల జననము - వారి తల్లితండ్రులు*.....

*నవ గ్రహదేవతల జననము - వారి తల్లితండ్రులు*.....

*1) సూర్యుడు :*
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని  "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను

*(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)*

కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని 
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను

*సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను*,
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను

యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు.....V 🙏

🦚 కృష్ణ నామం🦚

 🦚 కృష్ణ నామం🦚

                  


కృష్ణనామం పరమ ఔషధం. కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం.


శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది.


‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు.


కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది.


మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.


కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.


కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా…


*సత్య యుగంలో ధ్యానం వల్ల,


*త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల,


*ద్వాపర యుగంలో పూజలు, వ్రతాల వల్ల,


పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని,


‘హరే రామ హరే రామ రామరామ హరేహరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’

అనే నామ మంత్రం ఉపదేశించాడు.


ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.


‘కృష్ణః’ అంటే పాపాలు పోగొట్టేవాడు.


‘కృష్ణః’ అన్న పదంలోని.. ‘క’కారం బ్రహ్మవాచకం,

‘ఋ‘కారం అనంత వాచకం.

‘ష’ కారం శివ సూచకం,

‘ణ’ కారం ధర్మబోధకం.

చివర ఉన్న ఆ కారం శ్వేత ద్వీప వాసియైన విష్ణు వాచకం.

విసర్గం నర నారాయణార్ధకం.


కనుక కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి.


‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే.. పదివేల యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయని,


‘కృష్ణ’ అంటూ కీర్తించే వారి శరీరం ఎన్నటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుంది.


శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం స్కందపురాణంలో ఉంది.


‘కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల నాకెంత ప్రీతికలగుతుందంటే, ఇతర నామాలు కోటిసార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.


నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు.


కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణావతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది.


‘భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అని అర్ధం.


మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోడానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు.


చాంద్రాయణాదివ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది.


కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు.  కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుంది.  అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో క్లేశఘ్ని-పాపఘ్ని అనే బలవత్తరమైన శక్తులుండడమే నని-ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు.


కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తిని తత్త్వజ్ఞానాన్ని, భగవతృప్తిని కలిగిస్తుంది.


కృష్ణనామం జపం చేసేవారికి విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది.


పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం.


జీవులు తరించుటకు ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి.

ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు.


అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడు ఉదయించిననట్టు శరణాగత వత్సలుడు దేవకీదేవికి జననం. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తోంది.


ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం..!!.


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Pumpkin Seeds: నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Pumpkin Seeds: నానబెట్టిన గుమ్మడి గింజలు  తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

 గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్, కూర, స్వీట్ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి పారేస్తుంటాం. కానీ, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటే.. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనితో ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఎక్కువగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు కంట్రోల్లో ఉంటుంది. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే.. జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది.

గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే.. గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్టెన్షన్ కంట్లోల్లో ఉంచుతాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలు రక్తంపీహెచ్ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి.

గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి∙ గుమ్మడి గింజల్లో çపనాగమిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్నే పనాగమేట్, విటమిన్ బి–15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే సెల్ రెస్పిరేషన్ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

షుగర్ పేషెంట్స్కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.

రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోని సెలెనియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, ఏ, బీ, సీ విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తింటే చుండ్రు సమస్య కూడా రాదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.