23, నవంబర్ 2021, మంగళవారం
22, మే 2021, శనివారం
*శిక్ష* *( ఇది ప్రతి తల్లి తండ్రి చదవాల్సిందే)*
🎊💦🌈🏵️💥
ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు
15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు
ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు
అక్కడ పేకాట పడుచుపిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు.
దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.
20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.
అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.
దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు కదా...ఒకరోజు దొరికిపోయాడు.
మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి ఉరిశిక్షకైనా రోజును చెప్పేసారు
చివరగా అతని కోరిక ఏమని అడగగా తన తల్లిదండ్రులను వారిని చూడాలని కోరాడు
అతని కోరిక మేరకు వారిని పిలిపించారు
కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు
పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు
అప్పుడు అతను వారు కాదు నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు
ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసి మరి అతన్ని నిందించారు.
అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు
ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు
చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..
సేకరణ. మానస సరోవరం
చెప్పండి పెద్దాయన ... మీరు దేవుడిని చూసారా ??!
🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸
ఎన్నిసార్లు చదివినా ఈ పోస్ట్ మళ్లీ మళ్లీ చదవాలి అనిపిస్తుంది...
ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక.
అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది.
జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి
జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?
భక్తుడు : లేదండి
జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?
జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా?
జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు
భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు,
🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸
పిబరే రామ రసం - చాగంటి వారి అద్భుత ప్రవచనం.
https://youtu.be/jHSq50YnEoQ
🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸
జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?
భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు.
అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడిన జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.
సేకరణ...
🌷🌷🌷🔸🔸🔸🌷🌷🌷
ఓం నమశ్శివాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
సుదర్శనాష్టకం మహిమ:
అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురములో నివాసం ఉన్న రోజులు. కాంచీపురం పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓ సారి ఆచార్యులు తిరుప్పుట్కుళి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యుల హృదయం కరగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము, సకల భవరోగ హారిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు.ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్రాత్తాళ్వారు ప్రసన్నుడై పదహారు దివ్యాయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాలలో ప్రజలకు వ్యాపించిన విష జ్వరం పారద్రోలాడు.పిమ్మట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం..కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజల అందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుట పడింది.
సకల రోగాలకు నివారిణీ ఔషధములన్నియూ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండియే ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణము చెబుతోంది.శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతయూ సంగ్రహించి అందలి మంత్రాలను నిక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగమ సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కరుణతో సుదర్శన చక్రత్తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి పఠించండి, సకల భవ రోగ హారిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యముతో జీవించండి.
శ్రీ సుదర్శనాష్టకం
ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,
జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,
నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,
శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,
ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత
జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన ll
స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,
పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,
ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,
నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,
హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,
దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,
అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,
వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,
స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,
షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,
వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,
జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,
నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,
అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
శ్రీ గణపతి యే నమః ఓం శ్రీ రామ రామ రామ నారాయణ నారాయణ నారాయణ
*దేవునికి తలనీలాలుఎందుకివ్వాలి*
⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫలితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది.
నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.
శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం.
గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి.
అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు.
భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం.
తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడుసిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు.
⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం లో వినిపించే ఓం నమో వేంకటేశాయ మహా మంత్రం
https://youtu.be/Y4R80dL8cwg
⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు.
తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు.
అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు.
కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది.
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
12, జనవరి 2021, మంగళవారం
కాకతాళీయం - విశ్వప్రణాళిక...
🌸 ఎవరైనా ఒక వ్యక్తిని ఇవాళ కలవాలని అనుకోని ఆ వ్యక్తి కోసం మనం బయలుదేరాం కాని అనుకోకుండా ఆయనే దారిలో ఎదురైతే దానిని కాకతాళీయం లేదా యాదృచ్చికం అనుకుంటాం కానీ అక్కడ తెలిపతి నడిచింది అంటారు విషయం తెలిసినవారు.. అంటే ఇద్దరు ఒకే సమయంలో ఒకే విషయాన్ని అనుకోని లేదా అదే విషయాన్ని మానసికంగా ఇచ్చి పుచ్చుకున్నారు అనేది వాస్తవం... అది కొంతవరకు భౌతికం... కానీ విశ్వప్రణాళిక ప్రకారం జీవిత గమ్యంలో వారు ఆ సమయానికి అక్కడే కలుసుకోవాలి అని రాసుకున్నారు కాబట్టే కలిశారు అనేది విశ్వప్రణాళిక... ఇక్కడ మనం గమనించ వలసిన విషయాలు ఒకరినోకరు కలవాలి అనుకోవడం మోదటిది... కలవడం రెండివది... ఏ చోట అయితే కలిసారో అది మూడవది... ఈ మూడు మొదట నిర్నయి0చబడలేదు భౌతికంగా కానీ జరిగింది...
🌸 విశ్వప్రణాళిక గురించి మనకు అవగాహనకు ముందు మనం కార్యకారణ సంబంధం గురించి తెలుసుకుంటే విశ్వప్రణాళిక అర్ధమౌతుంది.. విశ్వం యొక్క ప్రణాళికలు అనంతంగా ఉంటాయి మనం అందులో భాగం అని తెలుసుకునే వరకు విశ్వం వేరుగా ఉంది నేను అందులో ఇమడటానికి ప్రయత్నిస్తున్నాను... అదే మనం విశ్వంలో భాగం అని అర్ధమైన మరుక్షణం మన జ్ఞానం, గమ్యం, ఆలోచన ఒకథాటిమీదకు వచ్చేస్తాయి.. ఇక్కడ మన ఆత్మ చేసిన ప్రయాణం తెలుసుకునే కొద్దీ కార్యకారణ సంబంధం అర్ధమవుతు ఇప్పుడు ఉన్న ప్రయాణాన్ని తేలిక చేస్తూ వెళుతుంది... అంటే కార్యం ఇప్పుడు జరుగుతుంది కానీ కారణం ఆత్మ ప్రయాణంలో ఎక్కడో అంకురార్పణ జరిగి ఉండవచ్చు... దానికి ఇప్పుడు జీవం ఇచ్చేస్తితికి మనం వచ్చాం అనేది సత్యం...
🌸 మన ఆత్మ ప్రయాణంలో ఎన్ని జన్మలు గడిచాయి లేదా మనం ఏమి చేసాము, ఏమి చెయ్యాలి అనుకున్నామో అవే జన్మకారణాలు... అవే ఎప్పుడు మనల్ని ఎదుగుదల వైపు నడిపిస్తూ ఉంటాయి... అంటే ఏఏ జీవిత అనుభవాలను ఎంచుకుని వస్తామో వాటి సంభావాలను ముందే నిర్ణయించుకొని...వస్తాము.
మనం ఎవరెవరితో భౌతిక అనుభవాలు పంచుకోవాలో వారితో కలిసే .. జన్మ ప్రణాళికలో అన్నీ చేర్చుకోవడం జరుగుతుంది... ఇదంతా మన ఎంపీకే... మన ఎంపిక సుదీర్ఘంగా ఉండటానికి కారణం దైవాన్ని దర్శించాలి అని వెళుతూ దారిలో ఉన్న బిచ్చగానికి ధర్మం చేయటం కూడా కారణమౌతుంది.. అందుకే మన పని మనం చేసుకుంటూ వెళ్లాటమే.. కానీ మనలో ఉన్న బావాలు, భావనలు, బావావేశాలు కూడా ఎక్కువ కారణం అవుతాయి.. ప్రేమగా ఉన్నప్పుడు చెప్పే మాట పువ్వు అయితే... కోపంలో చెప్పే మాట రాయిలా తగులుతుంది.. అదే బాధతో చెప్పే మాట(కొలమానానికి) అందలేదు...ఇవన్నీ మన తోటివారిని ప్రభావితం చేస్తు ఇంకో ప్రయాణానికి పునాది వేస్తుంది దీనికొఱకు ఇంకో ప్రణాళిక... ఇలా ఓ చెక్రంల ఏర్పడి మనల్ని అందులోకి లాగేస్తుంది... అది మనకు విసుగు వచ్చేవరకు... ఇవన్నీ తీరటం అనేది చెక్రం లో ఉన్నంత వరకు కుదరదు... చెక్రం దాటడానికి కావలసిన శక్తి పెంచుకుంటూనే వెళితే సాధ్యం.. దానికి ఇప్పుడు ఉన్న దారులు మాత్రం సాధన, స్వాధ్యాయా, సజ్జనసాగత్యలు.. ఇవే అమితమైన శక్తిని అందిస్తాయి.. మనం ఆత్మ అని తెలుసుకునే వరకు అంతర్గత చెక్రంలో..
తెలుసుకున్న తర్వాత విశ్వంలో... లేదా విశ్వప్రణాళికలో... విశ్వప్రణాళికలో కాకతాళీయం లేదా యాదృచ్చికంగా అనేవి ఉండవు వుండేది ప్రణాళికే.. ఏది జరిగిన అది ప్రణాళికా బద్ధంగానే...అది మన ఎంపిక ద్వారానే...
ఇప్పటికి ఇంతవరకు...
Thank you...🌸🌸🌸
తాపత్రయ విమోచనం గురించి చక్కని కథ.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు.
అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరము అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు.
ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.
స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘...వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.
“తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ..!” అన్నాడా భిక్షువు.
“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు బుద్ధ భగవానుడు .
ఏమని ప్రార్థించాలి
ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.
ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!
దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు.
సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.
భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.
భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.
అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!
- ఉప్పు రాఘవేంద్రరావు
విదుర నీతి
జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.
రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.
సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!
🌸నెగిటివ్ అంశాన్ని,పాజిటివ్ గా స్వీకరిస్తే!!!
ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చదవసాగింది.. నిశ్శబ్దంగా!
నెగిటివ్ ఆలోచనలు!!!
"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...
"ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఋణం తీరిపోయింది
"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.
"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.
"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"
చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.
కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.
ఆయనకి మెలుకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.
పాజిటివ్ గా ఆలోచిస్తే!!!
"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పికి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.
"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.
"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ప్రశాంతంగా సహజమరణం చెందారు.
"ఈ ఏడాదిలోనే నా కొడుకుకు కొత్త జీవితం వచ్చది. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.
"హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"
అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....
ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.
☀️☀️☀️
మంచి,చెడు అనేవి మన ఆలోచనా సరళే.మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అదే కదా ఆనందమయమైన జీవితం?
☀️☀️☀️
🌸 మార్పు - సహజస్థితి..🌸
🌸 మార్పు అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది... మనం మన సహజస్థితి అంటే ఎలాంటి వత్తిడి లేకుండా ఉండటం... ఏ వత్తిడి లేనప్పుడు ఎలా ఉంటామో అది మనం... మార్పు జరుగుతున్నప్పుడు ఘర్షణ అనేది వస్తుంది... దానిని అధిగమించాలి అంటే మార్పును అంగీకరించటం మినహా ఇంకో దారి లేదు... దానికి మనం ఏ పెరు పెట్టుకున్న మార్పు మనల్ని తనలో కలిపేసుకుంటుంది దానికి ఏలాటి భావం లేకుండా..
దీనికి ఓ ఉపమానం చిన్న కద...
🌸 మన ఇంటిలోకి ఓ దొంగ వచ్చాడు మనం ఏమి చేస్తాం సహజంగా ఆపటానికి చూస్తాం కుదరకపోతే ఏమి చేస్తున్నాడో చూస్తాం... ఆ దొంగ గాలి లేదా ఊపిరి అయితే... అంగీకరించాల్సిందే.. వేరే దారి ఉండదు కాబట్టి... మార్పు అలాంటిదే అని అనుకుంటే పరిస్థితిని దానికి తగినట్లుగా మార్చుకుంటాం.. అంటే ఇక్కడ మన శక్తికి మించి అయితే లోబడ్డట్లు అనుకుంటే ఇప్పటి వరకు మనం జీవించం... బలవంతపు మార్పు మనిషిని సహజత్వం నుంచి దూరంగా తీసుకువెళుతుంది... అదే అంతే సహజంగా ఆహ్వానిస్తే జీవితం పూల బాట అవుతుంది... తేడా ఏమిటి అంటే అ0గీకరించటం మాత్రమే... ఏదైతే మనసా వాచా కర్మణా మనం మార్పును ఆహ్వానిస్తామో ఆక్కడ ఉండేది ఆనందం.. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అక్కడ ఘర్షణ మొదలు... ఘర్షణ వచ్చింది అంటే అక్కడ బావావేశాలు మొదలు... సహజమైన శాంతి స్తితి మనలో ఉండదు..
🌸 సహజమైన స్తితిలో ఎదుగుదల ఉండదు కాబట్టి మార్పు అవసరం... ఎదుగుదల కోసం ప్రయాణం మార్పు కోసం వెధకడమే.. రెండు సరైనవే కానీ సరికాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరూ దోలాయన స్తితిలోకి వెళుతుంటారు... మన15 వ సంవత్సరం నుంచి 45 సంవత్సరం వరకు ఎదుగుదల కోసం మన ప్రయాణం అనివార్యంగా ఉంటుంది... ఇక్కడ ఘర్షణతో కలిసి ప్రయాణం... 45 నుంచి మన పరుగు ఆపుతాం కారణం అప్పటికే ఘర్షణ అంటే విసుగు వచ్చి... అక్కడ నుంచి సహజస్థితి కోసం పరుగులు... ఇలా మనకు మనం (ఆత్మ) ఎదుగుదల కోసం చిన్నప్పటినుంచి ప్రయాణం మొదలు పెట్టటం చాలా అవసరం... మన పిల్లలకు చిన్ననాటినుంచే ధ్యాన ప్రయాణం అనివార్యం కూడా... మనం ఏమి చేసినా ఇలా ఇప్పుడు ఉన్నస్తితి వారికి అందించగలిగితే ఇప్పటి జెనరేషన్ నుండి రెండో జెనరేషన్ శాంతి సౌఖ్యలతో విలసిల్లుతు0ది... దారి ఏదైనా గమ్యం కొరకే... గమ్యం ఏదైనా ఉన్నత స్తితి కొరకే.. ప్రయాణం ఏదైనా సహజ స్తితి కొరకే...
Thank you...🌸🌸🌸