25, ఏప్రిల్ 2020, శనివారం

పరందామానికి నిచ్చెన

"అనంత కోటి లోకాలకు నిచ్చేన వేయ బడి ఉంది.సహనం ధర్మంగా జీవిస్తే కొన్ని మెట్లు ఎక్కగల్గుతాము.శాంత ము అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా ఎలాంటి వారితో నైనా శాంత ము తో వుండగలిగితే ఇంకా కొన్ని మెట్లు అభివృద్ధి సాధిస్తాము.స్వాధ్యాయం ధర్మంగా జీవిస్తే పై లోకాలకు కొన్ని మెట్లు ఎక్క గలుగు తాము.అహింస పాటిస్తే అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ చూపిస్తూ ఉంటే,అన్ని కులాలు ,మతాలు వారి పట్ల అభిమానం ,ఇంట్లో బయట ఇలా హింస లేకుండా మాటల్లో ,చేతల్లో ,ఆలోచనల్లో హింస లేకుండా చేసుకుంటుంటే ఇంకా కొన్ని మెట్లు ఆటోమాటిక్ గా ఎక్కగల్గుతాము.కరుణా ఇతరుల పట్ల మన పట్ల కరుణ .మాట,చేత సహాయం.వినయం ధర్మంగా అనుసరిస్తే ఎంత ధ్యాని గాని ఎంత పండితుడు గా ని ,ఎంత ధన వంతుడు అయినా వినయం తో ఉంది తీరాలి.విర్రవీగటం మానుకోవాలి మనకంటే మహాత్ములు గోప్పవారు ఎందరో ఉన్నారు అని గుర్తు పెట్టుకొని మసలుతూ ఉంటే పై మెట్లు ఎక్కగలము.సత్యం తెలుసుకుంటాం'ఆత్మే సత్యం అని జీవితం ఒక నాటకం అందులో పాత్రధారులం అని జీవితాన్నీ రసవత్తరంగా జీవించాలి .అని మరణాంతర జీవితం ఉంది ఇలాంటి నాటకాలు ఎన్నో వేయాల్సి ఉంది 'అని సత్యం తెలుసుకొని సత్యం లో జీవిస్తుంటే ఏ బాధలు,ఆందోళనలు7 లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటే ఇంకా ఉన్నతి ని సాధిస్తాము.దానం.మనకు ఉంచుకోవాల్సింది ఉంచుకొని మిగతా ఇతరులకు ఇవ్వగలిగితే .మన దగ్గర ఉన్నది ఏదయినా విద్య,సంగీతం,భాష,జ్ఞానం డబ్బు ,ఏ సహాయం చేయడానికి వీలున్నదో అది చేయడమే దానం పై మెట్టుకు చేరు తుంటాం.అలాగే ధ్యానం చేయడమే మన ధర్మం
లోకాలన్నింటి జ్ఞానం,సృష్టి రహస్యాల జ్ఞానము ,పునర్జన్మ ,మరణం పుట్టుక ల జ్ఞాన్స్మ్,కార్య కారణాల జ్ఞానం సమస్త జ్ఞానాలు ధ్యానం చేస్తే నే తెలుస్తాయి ప్రపంచ జీవితం ఆధ్యాత్మిక జీవితం బాలెన్స్డ్ గా వుండగలుగుతుంటే స్వర్గానికి నిచ్చేన లు వేయకుండానే ఆటోమాటిక్ గా ఆ నిచ్చెన ఏర్పడి పరందామానికి మార్గం చూపుతుంది."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి