🙏\|/🙏 శ్రీనివాసుని చేత తాతా అని పిలిపించుకున్న భక్తుడు 🙏\|/🙏
🙏🌹🪷\|/🪷🌹\|/🌹🪷\|/🪷🌹🙏
🙏\|/తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది.
🙏\|/ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి?
🙏\|/పూర్వం శ్రీరంగంలో యామునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు.
🙏\|/ఆయనను శ్రీశైలపూర్ణులు అని కూడా అంటారు.
🙏\|/ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు.
🙏\|/ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి.
🙏\|/వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది.నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు.
🙏\|/ ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే...
🙏\|/బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు.
🙏\|/కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు.
🙏\|/ ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే...
🙏\|/వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు.
🙏\|/ఆకాశగంగ అలా వచ్చింది.
🙏\|/ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’
అని పురమాయించారు.
🙏\|/ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది.
🙏\|/అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు.
🙏\|/అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసారు స్వామి వారు.
🙏\|u/ఏడుకొండలవాడా... వేంకటరమణా...
గోవిందా గోవింద...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి