⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪ *1*
జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది. ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా వుంటాడు" అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి.
భూలోకంలో జీవించే జీవరాశులకు సూక్ష్మశరీరం లోనూ, మనోమయ శరీరంలోనూ, ఆనందమయ శరీరంలోనూ పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో నిబిడీకృతం అవుతుంది.
పౌర్ణమి రోజున మనస్సు ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వలోకాలలోని పరమగురువులు సమాయత్తమయి ధ్యానసాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు.
పౌర్ణమి రోజే కాకుండా, పౌర్ణమికి ముందు రెండు రోజులు కూడా ధ్యానానికి విశిష్టమైన రోజులుగా థియోసాఫికల్ సొసైటీ పరమగురువులు మేడమ్ H.P. బ్లావెట్ స్కీ సూచించారు.
ముఖ్యంగా పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది. ఈ విషయం పై ప్రతి ధ్యానసాధకుడూ దృష్టి
సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అలాగే పౌర్ణమి రోజుల్లో ధ్యానసాధకుడు తాను సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని ధ్యానాభిలాషులందరికీ ప్రబోధించాలని బ్లావెట్ స్కీ అన్నారు. *పౌర్ణమి - అమావాస్య* రోజులలో ధ్యానం చేయడం వలన *"దివ్యశక్తులు", "దివ్య సూక్తులు"* సాధకులు ఊర్థ్వలోకాల మాస్టర్స్ నుంచి పొందటానికి చక్కటి సదవకాశం లభిస్తుంది. ఈ రెండురోజుల్లో భూలోకంలోని ధ్యానసాధకుల - ఊర్ధ్వలోకాలలోని మాస్టర్స్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి.🔺
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి