7, ఆగస్టు 2026, శుక్రవారం

పిల్లలు భగవద్గీత

ప్రస్తుతం పిల్లలు అనగా భావి భారత పౌరులు నిరాశ,నిస్పృహ మానసిక కుంగుబాటుతో మానసిక బలహీనులైపోతున్నారు. మీ పిల్లలు భవిష్యత్తులో మీరు కోరుకొన్నవిధంగా ప్రయోజకులుగా హీరోలుగా మారాలంటే ప్రతిరోజూ కనీసం ఒక్క భగవద్గీత శ్లోకం తాత్పర్యం తో చదివించండి. పరమాత్మ వాక్కును పలికే మీ పిల్లలు పాజిటివ్ ఎనర్జీ తో తేజస్సుతో గొప్పవారిగా మార్పు చెందడం మీరు గమనించవచ్చు. 🙏

స్వామినారాయణ్ జీవిత చరిత్ర

 స్వామినారాయణ్ జీవిత చరిత్ర

స్వామి నారాయణ్ లేదా సహజానంద్ స్వామి గా పిలవబడే ఈయన ఒక యోగి మరియు సన్యాసిగా తన జీవితాన్ని గడిపారు. తన జీవిత కాలంలో హిందూ ధర్మం యొక్క భోదననాలను బోధించేవారు. ధర్మం, అహింస, బ్రహ్మఅచర్యం అనే అంశాలపై ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవారు.      

స్వామి నారాయణ్ఉద్ధవ్ సంప్రదాయకి నాయకత్వం కూడా  వహించారు. నాయకత్వం తన గురువు స్వామి రామానంద్ చనిపోయిన తర్వాత అందచేయటం జరిగింది.   బ్రిటిష్ రాజ్ తో కూడా స్వామి నారాయణ్ గారి చాలా మంచి సంభందాలు ఉండేవి. హిందువులు అని కాకుండా ఇస్లాం మరియు జోరాస్ట్రియన్ మతం వారు కూడా వీరిని అనుసరించే వారు

బాల్యం

స్వామినారాయణ్ 3 April 1781 సంవత్సరంలో chhapaiya అనే ఉత్తరప్రదేశ్ లోని గ్రామంలో హరిప్రసాద్ పాండే, ప్రేమవతి పాండే అనే దంపతులకు జన్మించారు. సమయంలో స్వామినారాయణ్ పేరు ఘనశ్యామ్ పాండే గా పెట్టడం జరిగింది. స్వామి నారాయణ్ జన్మించిన రోజే రామ నవమి కావటం కూడా చాలా మంచిది అని అనుకుంటారు.     

స్వామి నారాయణ్ కేవలం 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గ్రంధాలూ, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం లను నేర్చుకోవటం జరిగింది.స్వామినారాయణ్ తల్లి తండ్రులు చనిపోయిన తరవాత 1792 సంవత్సరంలో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు  ఇల్లు వదిలినీలకంఠ్ వార్నిపేరుతో బయలుదేరారు.  

ఇంటి నుంచి బయలు దేరిన స్వామి నారాయణ తన మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక ఆశ్రమం ను వెతకటం ప్రారంభించారు.

వేదాంతం, సమాఖ్య, యోగ, మరియు పాంచరాత్ర లాంటి తత్వ శాస్త్రాలను  వివరించే మంచి గురువును వెతకటం ప్రారంభించారు.

జీవా అంటే ఏమిటి?

ఈశ్వర అంటే ఏమిటి?

మాయ అంటే ఏమిటి?

బ్రాహ్మణ అంటే ఏమిటి?

పరబ్రహ్మణ అంటే ఏమిటి?

5 ప్రశ్నలకు కూడా సమాధానం వెతకటం ప్రారంభించారు.  

రామానంద స్వామి ను కలవటం

సంవత్సరాల సుధీర్గ ప్రయాణం తరవాత గుజరాత్ లోని ఝనాగఢ్ జిల్లా కి చేరుకున్నారు, అక్కడ ముక్తనంద స్వామి ని కలుసుకున్నారు. ముక్తనంద స్వామి స్వామినారాయణ్ మనసులో ఉన్న 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ముక్తనంద స్వామి యొక్క గురువు అయిన రామానంద్ స్వామి ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారుస్వామి నారాయణ్ వయస్సు 21 సంవత్సరాలు అయినప్పుడు రామానంద్ స్వామి తన పేరు ను నీలకంఠ పేరు నుంచి సహజానంద్ స్వామి అని పేరు పెట్టారు. రామానంద్ స్వామి తాను మొదలుపెట్టిన ఉద్దవ్ సంప్రదాయ కి స్వామి నారాయణ్ ను కూడా నాయకునిగా నియంనుంచారు.   

రామానంద్ స్వామి చనిపోయిన తరవాత ఉద్దవ్ సంప్రదాయ ను స్వామినారాయణ్ సంప్రదాయ గా మార్చటం జరిగింది. స్వామి నారాయణ్ చేసే చమత్కారాలు చూసి ప్రజలు తాను ఒక భగవంతుడి రూపం అనుకునేవారు.   

గుజరాత్ లో స్వామి నారాయణ్ చేసిన మంచి మార్పులు

స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చి నప్పుడు దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చాలా ఎక్కువగా ఉండేవి. సమయంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం రకమైన నేరాలను అదుపు చేయలేక పోయింది. స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చిన తరవాత తన బోధనలను విని చాలా మంది నేరస్తులు తమ నేర జీవితం వదిలి మంచి జీవితాన్ని ప్రారంభించారు మార్పుని చూసి ప్రభుత్వం స్వామి నారాయణ్ ను చాలా మెచ్చుకుంది.  

స్వామి నారాయణ్ మహిళలకు విద్య చాలా ముఖ్యమని చెప్పేవారు. రోజుల్లో చాలా మంది మహిళలకు చదువు ఎందుకని ప్రశ్నించిన స్వామి నారాయణ్ మాత్రం మహిళలకు చదువు ముఖ్యమని చెప్పేవారు. స్వామి నారాయణ్ సమయంలో అక్షరాస్యత చాలా బాగా పెరిగింది.      

స్వామి నారాయణ్ కుల వ్యవస్థ ను కూడా రద్దు చేయాలనీ అనుకున్నారు. కరువు సమయాలలో పేద మరియు తక్కువ కులాల వారిని ఆదుకునే వారు, వారికి భోజన వసతి కలిపించేవారు. సమాజం లోని వివిధ రకాల ప్రజలతో డబ్బుని సమకూర్చి పేదలలో పంచేవారు.       

స్వామి నారాయణ్ వేరే మతస్తులైన షియా ముస్లిం లను కూడా తమ తో పటు ఉండటానికి ప్రోత్త్సహించే వారు

స్వామి నారాయణ్ బ్రాహ్మణులు యజ్ఞాలు చేసే సమయంలో ఇచ్చే జంతువుల బలి ను కూడా నిందించే వారు. అహింస మార్గాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాలని జంతు హింస మానుకోవాలని అని చేప్పేవారు. తన అనుచరులను శాఖాహారం మాత్రమే తినాలని మాంసాహారం మానుకోవాలి అని సలహా ఇచ్చే వారు.     

స్వామి నారాయణ్ చేసే మంచి పనులను మరియు సమాజంలో తెచ్చే మార్పులను మహ్మత్మా గాంధి సైతం మెచ్చుకున్నారు. చట్టం ద్వారా కూడా వీలుకాని మార్పులను స్వామి నారాయణ్ గారు చేసారని పొగిడారు.   

మరణం

1830 సంవత్సరంలో తాను ఇక చనిపోతాడని తన అనుచరులను పిలిచి చెప్పారు  ఇలా చెప్పిన తరవాత 1 జూన్ 1830 లో మరణించడం జరిగింది.  

తాను చనిపోవటానికి ముందు తన తర్వాత ఎవరు తన స్థానాన్ని కోనసాగించాలన్న విషయాలను స్పష్టంగా చెప్పారు. చాలా వరకు బాధ్యతలు తన భందువులకే ఇచ్చారు

స్వామి నారాయణ్ మొదటి సారి నిర్మించిన మందిరం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన 500 ఎకరాలలో నిర్మిచడం జరిగింది. స్వామి నారాయణ్ తన జీవిత కాలంలో 6 అతి పెద్ద మందిర నిర్మాణాలు కూడా చేసారు. స్వామి నారాయణ్ అనుచరులు తనను అనుసరించే వారు క్రమ క్రమంగా పెరుగుతూ పోయారు. చాలా మంది తాను నారాయణ స్వామి అవతారం అని అనుకునే వారు, మరికొంత మంది మాత్రం తాను కృష్ణ భగవంతుడి అవతారం అని అనుకునేవారు.      

 

🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

 🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

ఎంతో పవిత్రమైన సాలగ్రామం గురించి మీకు తెలుసా? అవి ఎన్ని రకాలు? ఎటువంటి సాలగ్రామాలని పూజిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం


సాలగ్రామము విష్ణు ప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుకే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలో గానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామాలని పూజకు ఉపయోగిస్తారు. త్రిమతాచార్యులు తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.


దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది.

సాలగ్రామం విశిష్టత.. 

శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్ధం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్ధం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. 

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు, మూడవది మోక్షం పొందడానికి. తీర్థం తీసుకోవడం వల్ల అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి. సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం, స్పృశించడం, అర్చన చేయడం వల్ల అంతులేని పుణ్యం లఖిస్తుంది.


సాలగ్రామాలు శిలాజాలు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్యులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు వీటి గురించి వివరిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సాలగ్రామం ఎలా వచ్చాయంటే.. 

పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్టుగా చేశారు. వారికి తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నట్టుగా కథ ఉంటుంది. సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. 

సాలగ్రామాన్ని భక్తిశద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామం ఉన్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో చేసే పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే నూరురెట్లు అధిక ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాలను నశింపజేస్తుంది.


సాలగ్రామాన్ని పూజిస్తే కలిగే ఫలితం ఇదే.. 

సర్వరోగాలు తొలగిపోతాయి. సకల సంపదలు కలుగుతాయి. సర్వశుభాలను కలిగించడంతో పాటి మోక్షం ప్రాప్తిస్తుంది. సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకున్న, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుంది. సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒక్కసారి భక్తిశద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది.

సాల గ్రామ తీర్ధం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృతం సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్త్రములయందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది. సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాలు తెలియకపోయినప్పటికీ శక్తిననుసరించి పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు.

సాలగ్రామ ప్రాముఖ్యత 

అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి కానీ ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరి పడేటువంటి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం. కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో “నిత్యాగ్ని హోమం” చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారని చిలకమర్తి తెలిపారు.


సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి రేశవనామాలను వ్రాసినా కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుంది. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలినప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత  కలిగి ఉంటాయి. 

కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరిణామాలు కలుగుతాయి. అందుకే ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే సాలగ్రామాల గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్మరమని చిలకమర్తి తెలియచేసారు.

సాలగ్రామం చక్రాల పేర్లు 

1 చక్రం ఉంటే - సుదర్శనం, 2 చక్రాలు ఉంటే - లక్ష్మీనారాయణ , 3 చక్రాలు ఉంటే - అచ్యుతుడు, 4 చక్రాలు ఉంటే -జనార్ధనడు, 5 చక్రాలు ఉంటే - వాసుదేవుడు, 6 చక్రాలు ఉంటే - ప్రద్యుమ్నుడు, 7 చక్రాలు ఉంటే - సంకర్షణుడు, 8 చక్రాలు ఉంటే - పురుషోత్తముడు, 9 చక్రాలు ఉంటే - నవ వ్యూహము, 10 చక్రాలు ఉంటే - దశావతారము, 11 చక్రాలు ఉంటే - అనిరుద్ధుడు, 12 చక్రాలు ఉంటే - ద్వాదశాత్ముడు, 12 చక్రాల కన్నా ఎక్కువ ఉంటే “అనంతమూర్తి అంటారు.


సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపు పచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణం అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్ర్యాన్ని కలిగిస్తాయి. నలుపు రంగు కలిగి దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా ఉండి రేఖపాడవుగా ఉంటే దానిని “ఆదినారాయణ సాలగ్రామం” అని అంటారు. తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే దానిని “వాసు దేవ సాలగ్రామం” అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమైనది. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

రంగుల సాలగ్రామల అర్థాలు 

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా ఉండి రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, “పద్మ చిహ్నం” పైముఖంగా ఉంటే దానిని “అనిరుద్ధ సాలగ్రామము” అని అంటారు. ఇది చాలా మంచిది. కపిలవర్దం కలిగి చక్రం పెద్దదిగా ఉంటే దానిని 'నరసింహ సాలగ్రామం” అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా ఉండి మూడు బిందువులతో ఉన్నదానిని “'మత్యృమూర్తి సాలగ్రామం” అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ ఎడమవైపున గద చక్రాలు, కుడి వైపున రేఖ ఉన్న దానిని “'సుదర్శనమూర్తి సాలగ్రామం” అని అంటారు. శత్రుబాధలు నుండి రక్షిస్తుంది. వివిధ రంగుల్లో ఉండి అనేక చక్రాలు, అనేక రేఖలు ఉన్నదానిని “అనంతమూర్తి సాలగ్రామము” అని అంటారు. ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది.


3౩ ముఖాలు 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని “'షట్బక్రసీతారామ సాల గ్రామం” అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అఫ్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు. 

సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది సర్వో తృష్టమైనది, సర్వాంతర్యామి ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం నిజంగా అపూర్వమైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని జీవతాన్ని ధన్యం చేసుకోవడం శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి.

సాలగ్రామ పుట్టుక వెనుక మరొక కథ 

మరోకథ ప్రకారం ఒకానాకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు ఇంతటికీ కారణం తన సృష్టే కదా తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడుతుండగా ఆయన కళ్ల నుంచి రెండు కన్నీరు చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనదిగా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.

సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృతముతో గాని శుద్ది చేయాలి. “రుద్రాక్షధారణ” నియమాలనే సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా చేయించుకున్నా ఆ సాలగ్రామము శక్తి ద్విగుణీకృతమవుతుంది. సాలగ్రామశిలను షోడశోపచార పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది.

కనీసం సాలగ్రామంకు భక్తిశద్ధలతో నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా సర్వపాపాలు పరిహరింపబడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

💥సాలగ్రామము పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. 💥

సువార్త స్వస్థత కూటములు:

 సువార్త స్వస్థత కూటములు:   స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు.  ఇప్పటిదాకా కుంటి  ఉండింది. కుంటీ  పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ  ఉండింది .గుడ్డి  పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా నిజంగా  జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో  చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా  తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన  అప్పటివరకు  కళకళలాడిన   హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు.  ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.ఇంకా మా దరిద్రం ,రోగాలు పోలేదేమిటి అని అడిగితే దేవుడు పరీక్ష పెడుతున్నాడు కర్రు కాలితే గదా తుప్పు వదిలేది అంటారు.మీరు ఎంతోమంది  పాస్టర్ల గురించి ఎంక్వయిరీ చేయండి.షుగర్,బీపీ కాన్సర్ లు ఉంటాయి. 


వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . వీరు ముఖ్యానంగా హిందూ స్త్రీలు ,పిల్లలను మతం మార్చడానికి అదేపనిగా ప్రయత్నిస్తుంటారు.కొంతమంది ఆడవారిని గూడా తీసుకువచ్చి మాకు ఇలా అద్భుతాలు జరిగాయి,జబ్బులు పోయాయి,దరిద్రం పోయింది అని మెస్మరిజం తో వారిలో ఆశ పుట్టించి కుటుంబం లో ఒకరిని ఎలాగోలా మార్చేస్తారు.ఆడవారిని మార్చేస్తే ఆమె భర్తను మరియు పిల్లలను మార్చేస్తుందని వారి నమ్మకం.ఇలా ఎంతమందిని మార్చగలిగితే వారికి వారి మినిస్ట్రీస్ నుండి  అంత ప్రొమోషన్ లు ఉంటాయి . ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.మన దేశాన్ని  పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి విదేశాల కుట్రతో  వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .


కరోనా సెకండ్ వేవ్ లో అధికారిక లెక్కల ప్రకారం  తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు  మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి  పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి.ఎన్నో క్రిష్టియన్ కుటుంబాలు జీవితాంతం గుండెలు బాదుకొంటూ కన్నీటి ప్రార్ధన చేస్తూ వారికొచ్చే ఆదాయంలో 10 వ వంతు పాస్టర్లకు ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటికి వారి దారిద్య బాధలు తొలగవు. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు  అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.జాగ్రత్త : వారు మన ఇంటివైపు వస్తున్నారు అంటే శవాల నుండి ప్రేతాత్మలు మనఇంటివైపు వస్తున్నట్టే.


  గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా  చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి


భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్పమో  లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా  ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు


మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ  లేక ఓం శ్రీ మాత్రే నమః  ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి  మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.


ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త  కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.

17, మే 2026, ఆదివారం

కోణార్క్ సూర్యదేవాలయం

*🌹🛕 కోణార్క సూర్య దేవాలయం పౌరాణిక కళాత్మక రహస్యాలు 🛕🌹*

*కోణార్క సూర్యదేవాలయం కథను ప్రధానంగా రెండు కోణాల్లో చూడవచ్చు – ఒకటి పౌరాణిక విశ్వాసం, మరొకటి చారిత్రక వాస్తవం. ఈ దేవాలయం కేవలం శిల్పకళా అద్భుతం మాత్రమే కాదు; భక్తి, త్యాగం, విజ్ఞానం, శాస్త్రీయ నైపుణ్యం కలయికగా నిలిచిన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది.*

*పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుని కుమారుడు సామ్బుడు ఒక శాపం కారణంగా కుష్ఠు వ్యాధికి గురయ్యాడు. ఆ వ్యాధి నుండి విముక్తి పొందేందుకు నారద మహర్షి అతనికి సూర్యదేవుని ఆరాధన చేయమని సూచించాడు. దాంతో సామ్బుడు చంద్రభాగా నది తీరంలోని మిత్రవనంలో, ప్రస్తుత కోణార్క ప్రాంతంలో, పన్నెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన సూర్యదేవుడు అతని వ్యాధిని నివారించాడని, కృతజ్ఞతగా సామ్బుడు అక్కడ సూర్యదేవునికి ఆలయం నిర్మించాడని విశ్వాసం ఉంది. “కోణార్క” అనే పదం కూడా “కోణ” (తీరం) మరియు “అర్క” (సూర్యుడు) అనే పదాల కలయికతో ఏర్పడిందని చెబుతారు.*

*ప్రస్తుతం కనిపించే మహత్తర కోణార్క దేవాలయం మాత్రం 13వ శతాబ్దంలో, సుమారు 1250 CE సమయంలో, గంగ వంశానికి చెందిన మహారాజు నరసింహదేవుడు నిర్మించాడు. తన యుద్ధ విజయాలను స్మరించుకోవడం కోసం మరియు సూర్యదేవునిపై తన అపార భక్తిని వ్యక్తపరచడానికి ఈ అద్భుత నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. సుమారు 1200 మంది శిల్పులు పన్నెండు సంవత్సరాల పాటు నిరంతర శ్రమతో ఈ మహోన్నత కట్టడాన్ని నిర్మించారు.*

*కోణార్క దేవాలయం యొక్క అత్యంత విశేషమైన అంశం దాని నిర్మాణ శైలి. మొత్తం దేవాలయం సూర్యదేవుని రథం ఆకారంలో రూపుదిద్దుకుంది. ఇందులో ఉన్న ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజుల ప్రతీకగా భావించబడతాయి. అలాగే ఇరవై నాలుగు భారీ రాతి చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలకు లేదా సంవత్సరంలోని పన్నెండు నెలల ద్విపాక్షిక స్వరూపానికి సంకేతాలుగా చెప్పబడతాయి. ఈ చక్రాలు కేవలం శిల్పాలుగా కాకుండా, వాటిపై పడే నీడ ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా గుర్తించగలిగే సూర్య ఘడియారాలుగా కూడా పనిచేసేవి. ఇది ప్రాచీన భారతీయుల శాస్త్రీయ పరిజ్ఞానానికి అద్భుతమైన ఉదాహరణ.*

*ఈ దేవాలయం వెనుక ధర్మపదుడు అనే బాలుడి త్యాగగాథ కూడా ప్రజల హృదయాలను కదిలిస్తుంది. ప్రధాన శిల్పి బిసు మహారాణా ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. అయితే గర్భగుడి పైభాగంలోని కలశాన్ని అమర్చడంలో శిల్పులు విఫలమయ్యారు. ఉదయానికి పని పూర్తికాకపోతే 1200 మంది శిల్పులకు శిక్ష విధిస్తానని రాజు హెచ్చరించాడు. ఆ సమయంలో బిసు మహారాణా పన్నెండేళ్ల కుమారుడు ధర్మపదుడు అక్కడికి వచ్చి ఆ క్లిష్టమైన సమస్యను పరిష్కరించి కలశాన్ని విజయవంతంగా స్థాపించాడని చెబుతారు. అయితే ఒక చిన్న బాలుడు ఈ పనిని సాధించాడని రాజుకు తెలిసితే శిల్పులపై కోపం వస్తుందని భావించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ధర్మపదుడు దేవాలయ శిఖరంపై నుంచి సముద్రంలోకి దూకి ప్రాణత్యాగం చేశాడని ప్రజాగాథ చెబుతుంది. ఈ కథ అతని త్యాగానికి చిరస్మరణీయ గుర్తుగా నిలిచింది.*

*ప్రస్తుతం కోణార్క దేవాలయం తన సంపూర్ణ రూపంలో లేదు. ప్రధాన గర్భగుడి కాలక్రమేణా కూలిపోయింది; ప్రస్తుతం జగమోహన లేదా ముఖ మండపం మాత్రమే నిలిచి ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక రహస్య కథనాలు కూడా ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటి అయస్కాంత రహస్యం. ప్రధాన విగ్రహం గాల్లో తేలుతూ ఉండేదని, శిఖరంలోని భారీ అయస్కాంతాలు మరియు కింద ఉన్న లోహ నిర్మాణాల సమతుల్యత వల్ల అది సాధ్యమైందని ఒక విశ్వాసం ఉంది. పోర్చుగీస్ నావికులు తమ నౌకల దిక్సూచులకు అంతరాయం కలుగుతోందని భావించి ఆ అయస్కాంతాలను తొలగించారని, దాంతో నిర్మాణ సమతుల్యత దెబ్బతిని దేవాలయం కూలిపోయిందని ఒక ప్రజాగాథ చెబుతుంది. అలాగే కొందరు చరిత్రకారులు 16వ శతాబ్దంలో ముస్లిం సేనాధిపతి కలాపహాడ్ దాడుల వల్ల దేవాలయం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంటారు.*

*నేడు కోణార్క సూర్యదేవాలయం UNESCO గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఇది భారతదేశపు శాస్త్రీయ విజ్ఞానం, శిల్పకళా వైభవం మరియు ఆధ్యాత్మిక సంపదకు చిరస్మరణీయ నిదర్శనం. కోణార్క సూర్యదేవాలయం కేవలం రాతితో నిర్మించిన కట్టడం కాదు; ఇది భక్తి, విజ్ఞానం, త్యాగం మరియు కళాత్మక ప్రతిభల సమ్మేళనంగా భారతీయ సంస్కృతికి అజరామర చిహ్నంగా నిలిచిపోయింది.*
🌹 🌹 🌹 🌹

21, ఫిబ్రవరి 2026, శనివారం

మంచి నిద్ర…* *మీ సొంతం..!*

*మంచి నిద్ర…*
                *మీ సొంతం..!*
                ➖➖➖✍️

*రాత్రి పడుకునే ముందు     ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? 
````
*నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? 
లేదా 
*పీడకలలు భయపెడుతున్నాయా? 

అయితే మన పురాణాలు చెప్పిన 
ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.. 

పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే... ఎంతటి ఒత్తిడి అయినా మాయమై, వెంటనే గాఢ నిద్ర పడుతుంది!

ఆ శ్లోకం ఇదే:👇````
*"అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహాబలమ్ |*
*కపిలో మునిరాస్తీకః పంచైతే సుఖశాయినః ||"*````

*ఈ ఐదుగురి పేర్లే ఎందుకు తలచుకోవాలి? 

(సింపుల్ లాజిక్):


*అగస్త్యుడు: 
ఈయనను తలచుకుంటే భయాలు పోతాయి. అంతేకాదు, తిన్న ఆహారం సులువుగా అరిగిపోయి శరీరం తేలికపడుతుంది. నిద్ర పట్టకపోవడానికి ఒక కారణం అన్నం అరగక పోవడం, అగస్త్య స్మరణ అజీర్ణ వ్యాధులు తొలగిస్తుంది, వారు వాతాపి లాంటి రాక్షసుణ్ణే అరిగించుకున్నారు.


*మాధవుడు (విష్ణువు): పాలకడలిలో ప్రశాంతంగా యోగనిద్రలో ఉండే విష్ణువును తలచుకుంటే, మన మనస్సులోని అలజడులు ఆగిపోయి ప్రశాంతత వస్తుంది.


*ముచుకుందుడు: 
ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని వరం అడిగి మరీ నిద్రపోయిన రాజు ఇతను. ఇతన్ని తలచుకుంటే నిద్ర మధ్యలో అస్సలు మెలకువ రాదు.


*కపిల మహాముని: 
ఈయనది ప్రపంచాన్ని మర్చిపోయే గాఢమైన ధ్యాన నిద్ర. ఈ పేరుతో మనకు కూడా అలాంటి సుఖ నిద్ర పడుతుంది.


*ఆస్తీకుడు: 
ఈ మునిని తలచుకుంటే పాములు, విష పురుగుల భయం ఉండదు. మనకు ఒక భద్రతా భావం కలుగుతుంది. నిద్ర పట్టక పోవడానికి ప్రధాన కారణం భయం, అది వీరి స్మరణ తో  పోతుంది.

కాబట్టి భయాన్ని పోగొట్టి, ఆరోగ్యాన్ని,రక్షణను మరియు ప్రశాంతతను ఇచ్చే ఈ ఐదుగురిని తలుచుకొని పడుకోవాలని పురాణ వచనం...✍️````
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

5, ఫిబ్రవరి 2026, గురువారం

*మన ఆరోగ్యం…

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇
*మన ఆరోగ్యం…!


*ఆయుర్వేదం ప్రకారం తప్పక పాటించాల్సిన నియమాలు!!* 
                ➖➖➖✍️


*1. అజీర్ణే భోజన విషం.*```
గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం.
```
*2. అర్ధరోగహరి నిద్ర.*```
సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..```

*3 ముద్గదాలి గదవ్యాలి.*```
అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 
```
*4. భగ్నాస్థి-సంధానకరో లశునః.*```
వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.``` 

 *5. అతి సర్వత్ర వర్జయేత్.*```
రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా ఉండండి. 
```
*6. నాస్తి మూలమనౌషధం.*```
శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. ```

 *7. న వైద్యః ప్రభురాయుషః*```
ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు. (వైద్యులకు పరిమితులు ఉన్నాయి)
```
*8.చింతా వ్యాధి ప్రకాశాయ*```
ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. ```

*9. వ్యామశ్చ శనైః శనైః.*```
ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.(వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) ```

 *10. అజవత్ చర్వణం కుర్యాత్.*```
మీ ఆహారాన్ని మేక లాగా నమలండి.
(ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 
```
 *11. స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।*```
స్నానం కుంగుబాటు(డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది. చెడు కలలను దూరం చేస్తుంది.
```
 *12. న స్నానమాచరేద్ భుక్త్వా.*```
ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయ కూడదు.(జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). ```

 *13. నాస్తి మేఘసమం తోయం.*```
స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 
```
 *14. అజీర్ణే భేషజం వారి.*```
అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.```

 *15. సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।*```
ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. 
అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.```

 *16. నిత్యం సర్వ రస భక్ష్యః॥*```
మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.(అనగా: ఉప్పు,తీపి,చేదు,పులుపు,వగరు (ఆస్ట్రింజెంట్)మరియు ఘాటు (పంజెంట్). ```

 *17. జఠరం పూరాయెదర్ధం అన్నార్, భాగం జలేన్ చ ।*
 *వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్॥*```
మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, 
పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.```

 *18. భుక్త్వా శతపథం గచ్ఛేద్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।*```
ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. ```

 *19. క్షుత్సాధుతాం జనయతి।*```
ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది.. ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 
```
*20. చింతా జరా నామం మనుష్యాణాం* ```
ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. ```

*21. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్ ।*```
ఆహారంకోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా).```

 *22. సర్వధర్మేషు మధ్యమామ్.*```
ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్లడం మానుకోండి.
```
*ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🕉️🍀🌺