26, మార్చి 2024, మంగళవారం

శివాలయంలో నంది ఎందు కుంటుంది? నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*

*ప్ర : శివాలయంలో నంది ఎందు కుంటుంది?  నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*
జ: ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయంలోని స్వామివారి వాహనం స్వామి ముందు ఉండాలి. శివుని వాహనం కనుక నంది ఉంటుంది. అంతేకాక శివగణాలకు అతి ముఖ్య నాయకుడు నంది - వృషభం. ఇది ధర్మానికి సంకేతం. సత్యం, అహింస, అస్తేయం (అక్రమార్చన లేకపోవడం), శౌచం (శుచి) - ఈ నాలుగు పాదాలతో ఉండే ధర్మమే వృషభం. దైవం ధర్మాన్నే అధిష్ఠించి ఉంటాడు. ధర్మం ద్వారానే భగవంతుని చూడగలం. ధర్మహీనుని దైవం అనుగ్రహించడు. ధర్మమే భగవత్సాక్షాత్కారానికి మూలం అని తెలియజేసేందుకే, నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారు. అంతేకాక ప్రతివారూ భ్రూమధ్యంలో (కనుబొమ్మల నడుమ) జ్యోతిర్లింగ స్వరూపునిగా శివుని ధ్యానించడం ఉత్తమ మార్గమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కొమ్ముల మధ్య నుండి చూడడం ఈ విధానాన్నే ఉపదేశిస్తుంది.

*ప్ర : గుళ్ళను దేవుడు రక్షించడెందుకు?*
జ : దేవతలు తమకు తాముగా ఏమీ చేయరు. ఈ గుళ్ళు, గోపురాలు వారు కట్టుకోలేదు; కట్టమని కోరలేదు. మానవుడు తన కోసం నిర్మించుకొన్నాడు. కాపాడుకోవటం కూడా తన బాధ్యతే. దేవుడు సాక్షిమాత్రుడు. కట్టినవాడికి పుణ్యమిస్తాడు. పడగొట్టినవాడికి పాపమిస్తాడు. ఆయా పాపపుణ్యఫలాలను పరిపక్వకాలంలో అనుభవిస్తారు. ఒకడెవడో తనకు గుడి కట్టాడుగదా అని దేవుడక్కడ కాపలా ఉండి ఆలయ నాశకులను శిక్షిస్తూ ఉండడు. పూజలు చేస్తే కోరికలు తీరుస్తాడు. పాపములు చేస్తే కాలాంతరమున ఫలం అనుభవింపజేస్తాడు.
తనను రక్షించుకోలేనివాడు, తన గుడిని నాశనం చేస్తుంటే, దోచుకొంటుంటే చూస్తూ ఊరుకొన్నవాడు (ఇక) భక్తులనేమి కాపాడతాడు - అనేది ఆధునిక వాదన.
దీనికి జవాబు : భక్తితో ప్రార్థించిన వారి కోరికలను తీర్చగలడు. తన గుడిని రక్షించుకోవాలని మాత్రం సంకల్పించడు. ఎందుకంటే, ఆయనకు (తనవే అయిన) సంకల్ప వికల్పములు లేవు. కోరగల భక్తుడు, పిలువగల భక్తుడు, ఆవాహన చేయగల భక్తుడు పిలిస్తే, కోరితే, గుడిని రక్షించమంటే ఆ భక్తుని కోసం రక్షిస్తాడు; తన కోసం మాత్రం కాదు.

ఆలయం ముందు ధ్వజ స్తంభం ఎందుకు ఉంటుంది..?

ఆలయం ముందు ధ్వజ స్తంభం ఎందుకు ఉంటుంది..? 

🌺ధ్వజం అనగా పతాకమని, స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగరవేయడానికి ఉపయోగించబడే ఒక కర్ర లేదా వృక్షం అని అర్థం. హైందవ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఒక ఆచారం. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు.

🌺ప్రతి దేవాలయంలోనూ ప్రధాన రాజ గోపురం దాటి లోపల కి వెళ్లగానే ముందుగా కనిపించేది ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభానికి పై భాగంలో బంగారు, వెండి తొడుగులతో కూడిన అలంకారము మరియు కొన్ని గంటలు వేలాడుతుంటాయి. ఈ స్తంభాన్ని ఆధ్యాత్మిక భాషలో ధ్వజస్తంభం అంటారు. 

🌺ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా భావిస్తారు. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులవంటివి.

🌺నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. 

🌺ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. 

🌺ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాల్లో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. 

ఎలా తయారు చేస్తారు ?
🌺పలాస (మోదుగ), అశ్వత్థ (రావి), బిల్వ (మారేడు), బంధూకం (వేగిస), పనస (పనస), వకుళ (బొగడ), అర్జున (మద్ది) వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై వరకు ఎగురవేస్తారు. 

🌺ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని కిందకి దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. 

🌺గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమంగా మన శాస్త్రాల్లో పేర్కొన్నారు. అంతేకాదు, భక్తులు ఆలయానికి చేరేసరికి వేళదాటి ఆలయం ద్వారాలు మూసివేస్తే దిగులు పడనవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శనం పొందిన ఫలితం వస్తుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనపెద్దలు ఆలయాల్లో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.


🌹🌹🌹🌹🌹🌹

21, మార్చి 2024, గురువారం

పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా?

*చదివి వదలవద్దండి*                             జ్ఞానాన్ని పంచండి.....                

పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా? మంచివాళ్లకి చెడు ఎందుకు జరుగుతుంది?

చెడంటూ ఎవరికీ జరగదు. ఎన్నో జరుగుతుంటాయి. నచ్చని వాటిని మీరు చెడు అనుకుంటారు. చూడండి...ఈ రోజు పెళ్లనుకుందాం. మీరు వీధిలో ఊరేగింపుగా వెళదామనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద వాన పడింది. అంతా తడిసి ముద్దయ్యారు. అది మీకు చెడు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్ధిస్తున్నారు. అతనికి వర్షం పడుతోందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అన్నది కేవలం మీ ఇష్టాయిష్టాల మీదే ఆధారపడుతుంది, అవునా? కాబట్టి మనం జీవితాన్ని మంచీ చెడులని వేర్వేరుగా చూడొద్దు.

ఎందుకంటే మీరంతా దేవుణ్ణి నమ్ముతున్నారు, అవునా? మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయనే అన్నీ సృష్టించాడని నమ్ముతున్నప్పుడు ఇక మంచీ చెడూ ఎక్కడ? ఇదంతా మీకు అవసరమేనేమో? అందుకే ఆయన ఇలా చేస్తున్నాడేమో అనుకోవాలి. కాదంటే మీ దేవునిపై మీ నమ్మకం అసలైనది కాదని అర్థం. అవునా? మీరు దేవుణ్ణి నమ్మితే, అతను చేసేవన్నీ సరైనవై ఉండాలి. అవునా? లేదంటే అసలు దేవుణ్ణి తొలగించాలి! తాను చేసేది అతనికే తెలియకుంటే, అతనిని ఆ ఉద్యోగం నుంచి తప్పించాలి. అతను అంతా తెలిసే చేస్తుంటే మనం ఇక ఫిర్యాదు చేయకూడదు. 
                                                    
🪷⚛️✡️🕉️🪷

*తలరాత మార్చుకోవచ్చా*????

హరిఓం   ,                           -                                                         -               *తలరాత మార్చుకోవచ్చా*????

అవును మార్చుకోవచ్చు .ఎలాగంటే ఏ విషయానికైతే నీవు బాధ పడుతున్నావో దాని గురుంచి కొంత సేపు దృష్టి పెట్టి చూడు .అలోచించు ,ఈ బాధ నాకు ఎందుకొచ్చిది , ఏకారణం వల్ల వచ్చింది ,నేను ఏ తప్పుచేయడం వలన వచ్చింది ,అని అలోచించు .సమాధానం నీకు వస్తుంది .

అవును నీకు సమధానం దొరుకుతుంది, నీకు వచ్చిన బాధకు సమధానం దొరుకుతుంది .కారణం ఏమైవుంటుందో తెలుసుకుని వొప్పుకో ,నీ బాధకు కారణం నీవు మాత్రమే అని తెలుసుకుంటావు ,

నేను పూర్వం చేసిన తప్పుకు అనుగుణం గా ఈ బాధ వచ్చింది అని వొప్పుకో .ఇదనీవు రాసుకున్న తలరాత అని వొప్పుకో .దీనిని నేను మార్చుకుంటున్నాను ఆనుకో .ధ్యానంలో నిమగ్నుడవుకమ్ము .
  ధ్యానాగ్ని దగ్ధ కర్మణి అని గీతలో భగవానుడు ఎన్నడో చెప్పివున్నాడు .మర్చిపోకు తీవ్రం గా ధ్యానం చెయ్యి .నా కర్మనుంచి నేను తప్పుకుంటున్నాను అని అనుకో , నమ్మకంగా నమ్ము .తప్పని సరిగా తప్పించుకుంటావు .
  నిన్ను నీవు నమ్ముకో ,ఎవరిని నమ్మకు నిన్ను నీవు మాత్రమే ఉద్ధరించుకోగలవు .ఎవరూ నిన్ను ఉద్దరించలేరు , ఏ పూజలు ,వ్రతాలూ ,నోములు ,ఉపవాసాలు ,జపాలు ,దానాలు ,ఏమి కూడ నిన్ను కాపాడలేవు .తెలుసుకో ఇదే నిజం, నివు నమ్మలేని నిజం .పూర్వం నేను చేసిన కర్మకు ప్రతిఫలంగా నాకు ఈ భాధ వచ్చింది ,కావున ఈ భాధను నేను మాత్రమే తప్పించుకోవాలి అని నిజముగ నమ్ము .తప్పించుకుంటావు .
 నీ కర్మనుంచి నీవు ఖచ్చితంగా తప్పించుకుంటావు .ఎప్పుడు ? నీవు నమ్మినపుడు - నా కర్మకు నేనే కారణం అని .
 నా కర్మనుంచి నేను బయట పడుతున్నాను .
 నాలో మంచి కర్మ లేదు ,చెడు కర్మ లేదు ,నిర్గుణ స్థితికి నేను చేరుకుంటున్నాను .అని అనుకుని ధ్యానము చేయి , చేయగ ,చేయగ నీ కర్మలు అన్ని దగ్దమవుతాయి .నీ కర్మలనుంచి నీవు కచ్చితంగా తప్పించుకుంటావు .ఇది నేను చెప్పిన మాట కాదు .గీతలో శ్రీ కృష్ణులవారు చెప్పిన విషయము .
 భగవానుడను నమ్ము ,నిన్ను నీవు పుర్తిగా నమ్ము ,ఎవరిని నమ్మకు ,ధ్యానాన్ని నమ్ము ధ్యానము చేయి .కర్మలు దగ్ధం చేసుకో ......🙏

*ఓం అనేది విశ్వ ప్రకంపన*.

*ఓం అనేది విశ్వ ప్రకంపన*.....

*ఓం శబ్దం అనడం కంటే ఒక కంపనం అనడమే సమంజసం. శబ్ధానికి మరియు కంపనానికి మధ్య వ్యత్యాసం ఉంది. శక్తికి శబ్దానికి కూడా వ్యత్యాసం ఉన్నట్లే, శబ్దానికి కంపనానికి మధ్య వ్యత్యాసం ఉంది. శక్తి శబ్దంలా వ్యక్తం అవగలదు. అలాగని రంగులా, రుచిలా, వాసనలా, ఇలా ఎలాగైనా వ్యక్తం అవగలదు. ఎలాగైతే విద్యుచ్ఛక్తి కదలికలా, వేడిలా, కాంతిలా వ్యక్తమవుతోందో, అలాగే మీరు చూసి విని, గ్రహించే ఈ భౌతిక శరీరాలు, పదార్థాలు, విశ్వంలోని సృజనాత్మతకు, సృష్టించే క్రియాశీలకమైన శక్తి యొక్క భౌతిక వ్యక్త రూపాలు. ఇదే భగవంతుని సంకల్ప శక్తి.* 
*ఓం అనేది ఈ విశ్వ శక్తికి చిహ్నం. ఒక బిందువు నుండి అది అంతరిక్షం మరియు సమయాలలో ఈ విశ్వం యొక్క పరిమాణంలోకి విస్తరిస్తుంది. అది కేవలం రూపం లేని, ఊహించలేని, అతీంద్రియ శక్తి లేదా కంపనం నుండి, అది కళ్ళకు కనిపించేదిగా, ప్రత్యక్షమైనదిగా, తెలివైనదిగా, ఆలోచించ దగినదిగా మరియు సహేతుకమైనదిగా ఈ స్థూల విశ్వం మరియు మన స్వంత శరీరాలలో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఓం అనే మంత్రం కేవలం పదం మాత్రమే కాదు, దాని కారణాలలో వ్యక్తిత్వాన్ని కరిగించడంలో మనస్సు యొక్క ప్రయత్నం కూడా.*........🙏

24, ఫిబ్రవరి 2024, శనివారం

స్తోత్రాలు

 ఏ స్తోత్రం చదివితే  ఏ ఫలితం వస్తుంది... 

ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్  అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

Https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !! https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన https://https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏

లవకుశులు తర్వాత రాముని వంశం

చాలామంది కి లవకుశల తరువాత రాముడి వంశం గురించి పెద్దగా తెలియదు. రామ లక్ష్మణ భరత శత్రుఘనుల సంతానం వారి భార్యలు, గురించి విపులంగా తెలుసుకుందాం... ఆ తరువాత వారి వంశం ఎలా సాగిందో కూడా వివరిస్తాను. పోతనగారి భాగవతం లో నవమస్కందంలో కుశలవుల అనంతర రఘువంశం వివరంగా లిఖించారు. వాల్మీకి రాసిన ఆనంద రామాయణం అనే కావ్యంలో వివాహకాండలో రామలక్ష్మణభరతశత్రుఘ్నుల కుమారుల వివాహల గురించి వివరంగా చెప్పబడింది.

శ్రీరాముడు ఏకపత్నివ్రతుడు అయినప్పటికి తన కుమారులకు, తన తమ్ముళ్ల కుమారులకు ఇద్దరేసి భార్యలు ఉన్నారు.

1). శ్రీరాముడు...సీతాదేవి వీరి కుమారులలో పెద్ద కుమారుడు కుశుడు మరియు చిన్న కుమారుడు లవుడు. కుశుడు కి ఇద్దరు భార్యలు...చంపిక మరియు కుముద్వతి ఈమె నాగకన్య ఈమెకు మరో పేరు కంజాననా. వీరి కుమారుడు అతిధి ద్వారా రఘువంశం వృద్ధి చెందింది. లవుడు భార్య పేరు సుమతి. వీరి సంతానం వివరాలు తెలియరాలేదు.

2). భరతుడు ... మాండవిల పుత్రులు పుష్కరుడు, తక్షుడు.
పుష్కరుని భార్యలు కళావతి(నాగకన్య) మరియు చంచల (గంధర్వ కన్య)
తక్షుడు భార్యలు కాళిక (నాగకన్య ) మరియు చపల (గంధర్వ కన్య).

3). లక్ష్మణ... ఊర్మిళల పుత్రులు
అంగదుడు, చంద్రకేతుడు 
అంగదుని భార్యలు కంజాక్షి (నాగకన్య ),
చంద్రిక (గంధర్వకన్య )
చంద్రకేతుడు భార్యలు కంజాగ్రీ (నాగకన్య), చంద్రాసన (గంధర్వకన్య).

4). శత్రుఘ్నుడు... శృతకీర్తిల పుత్రులు సుబాహుడు మరియు శృతసేనుడు 
సుబాహుని భార్యలు కమల (నాగకన్య),
అచల (గంధర్వకన్య).
శృతసేనుడు భార్యలు మాలతి (నాగకన్య), మదనసుందరి (గంధర్వకన్య).

మొత్తం 16 మంది కోడళ్ళుకు, 120 మంది మనుమళ్లు, 24 మంది మనుమరాళ్లు కలిగారు.
వీరంతా వివిధ రాజ్యాలు స్థాపించుకుని అప్పటి భూమాండలామంతటా విస్తరించారు.

వీరందరి వివాహాలు శ్రీరాముని ఆధ్వర్యంలోనే జరిగినవి. సీతానిర్యాణానంతరం నిత్య యోగాలు యజ్ఞాలు జరిపిస్తూ కఠోర బ్రహ్మ చర్యంతో 11,000 అహోరేవ వత్సరాలు పరిపాలించాడు. అహోరేవ వత్సరాలంటే ఎమిటో తెలుసుకుందాం " ఒక రాజు ధర్మనిష్ఠతో చేసే పాలనలో ఒకరోజు.. ఒక సంవత్సరానికి సమానం". ("for a Maharaja, a person who lives in accordance with dharma, a day is equivalent to a year") అనే సూత్రం ప్రకారం రాజులు చేసిన రాజ్యపాలనని అహోరేవ వత్సరాలతో చెప్తారు. అహోరేవ వత్సరాలని 360 చేత భాగిస్తే సౌరమాన వత్సరాలు వస్తాయి. 11,000/360=30.55
అనగా శ్రీరాముడు ముప్పై సూర్యమాన సంవత్సరాలు పరిపాలించాడు.

ఇకపోతే శ్రీరాముని ప్రధమ పుత్రుడు కుశుడు ద్వారా రఘువంశం ఏవిధంగా వృధి చెందినదో పోతన భాగవతం ఆధారంగా తెలుసుకుందాం. వీరి వంశం కురుక్షేత్ర సంగ్రామం వరకు మనుగడలో ఉంది.

శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించాడు.....🙏