7, జూన్ 2020, ఆదివారం

పితృదేవతల కోసం మొక్కలు🌸 🌱 🌸🌲🌸🌳🌸🌴🌸🌿🌸☘️🌸



🌸 మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. 

🌸ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం. 

🌸వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. 

🌸ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. 

🌸మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది.

🌸 సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. 

🌸కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది.

🌸 అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. 

మన వంశం ఆశీర్వదించబడుతుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
స్వస్తి.........

👉 **సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః **

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా ?


దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం
మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇప్పుడు చెప్పండి మీలో ఏమి తక్కువగా ఉంది? .
ఇక నిరాశ , నిస్పృహ వద్దు. 
గమ్యం చేరే వరకు ప్రయాణిoచండి.
" వచ్చి పోవడానికి రాలేదు. ..
ఇచ్చి పోవడానికే వచ్చాము".

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *- *మాస్టర్ E.K*

⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪  *1* 

జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది. ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా వుంటాడు" అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి.

భూలోకంలో జీవించే జీవరాశులకు సూక్ష్మశరీరం లోనూ, మనోమయ శరీరంలోనూ, ఆనందమయ శరీరంలోనూ పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో నిబిడీకృతం అవుతుంది.

పౌర్ణమి రోజున మనస్సు ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వలోకాలలోని పరమగురువులు సమాయత్తమయి ధ్యానసాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు.

పౌర్ణమి రోజే కాకుండా, పౌర్ణమికి ముందు రెండు రోజులు కూడా ధ్యానానికి విశిష్టమైన రోజులుగా థియోసాఫికల్ సొసైటీ పరమగురువులు మేడమ్ H.P. బ్లావెట్ స్కీ సూచించారు.

ముఖ్యంగా పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది. ఈ విషయం పై ప్రతి ధ్యానసాధకుడూ దృష్టి
సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అలాగే పౌర్ణమి రోజుల్లో ధ్యానసాధకుడు తాను సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని ధ్యానాభిలాషులందరికీ ప్రబోధించాలని బ్లావెట్ స్కీ అన్నారు. *పౌర్ణమి - అమావాస్య* రోజులలో ధ్యానం చేయడం వలన *"దివ్యశక్తులు", "దివ్య సూక్తులు"* సాధకులు ఊర్థ్వలోకాల మాస్టర్స్ నుంచి పొందటానికి చక్కటి సదవకాశం లభిస్తుంది. ఈ రెండురోజుల్లో భూలోకంలోని  ధ్యానసాధకుల - ఊర్ధ్వలోకాలలోని మాస్టర్స్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి.🔺

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *-మాస్టర్ E.K.*

⚪⚪⚪⚪⚪⚪⚪⚪2
                  
పౌర్ణమి రోజుల్లో మనస్సు వికలం కాకుండా ప్రశాంత స్థితిని పొందేలా చూసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య రెండూ కూడా ధ్యాన సాధకులకు విశేషంగా శక్తి సమీకరణ సమయాలు ! నిర్మలమైన సమస్థితినీ, నిశ్చలధ్యానస్థితిలో స్థితమైనప్పుడు లోపల ఉండేది *"నేను"* మాత్రమే ! అదే ధ్యానం అంటే ! దీనినే *"ప్రకృతి సహజ సిద్ధమైన స్థితి"* అంటారు.

పౌర్ణమి రోజుల్లో అల్పమైన పనులలో నిమగ్నం అవ్వడం అంటే .. అది మృత్యువు కన్నా హేయమైనది అని గ్రహించాలి. పౌర్ణమిరోజున ఉబుసుపోని కబుర్లతో సమయాన్ని వృధా చేయడం వివేకవంతుల లక్షణం కాదు. ముఖ్యంగా పౌర్ణమిరోజునే అంతర్యామి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మస్వరూపం మనలోనూ, అందరిలోనూ పౌర్ణమి రోజు విశేషంగా గోచరిస్తుంది. అంతేకాదు ఇతరులతో మనకు మనోహరమైన, లయ బద్ధమైన ఆత్మీయ సంబంధం ఏర్పడుతుంది.

పౌర్ణమి ధ్యానప్రభావం వల్ల నిత్యజీవితంలోని తొందరపాటు, గజిబిజి, గందరగోళం వంటి వాటిని అవలీలగా అధిగమించగలం.

పౌర్ణమి రోజున మీతో మీరు కూడీ వుండగలరు. మీతో మీరు కూడి వుండాలన్న ఆలోచనలతో అప్రయత్నంగా అవలీలగా సూక్ష్మశరీరయానం చెయ్యగలం. దివ్యలోకాలను సందర్శించగలం. విజ్ఞానమయకోశం పైనా, ఆనందమయకోశం పైన పూర్తిస్థాయి ప్రజ్ఞను సంపాదిచగలుగుతాం.

పౌర్ణమి ధ్యానసాధన వల్ల ముఖ్యంగా నాడీమండల శుద్ధీ, కుండలినీ జాగృతి అవలీలగా జరుగుతుంది. పౌర్ణమి రోజున మౌనం పాటించడం వల్ల *"టెలీపతీ"* పురోగతి సాధిస్తుంది.

ముఖ్యంగా ప్రతి ఒక్క ధ్యానసాధకుడు గుర్తించుకోవలసిన విషయం పౌర్ణమి రోజు రాత్రి ద్రవాహారం మాత్రమే తీసుకుంటే భౌతిక శరీరం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.🔺