19, జులై 2023, బుధవారం

🎻🌹🙏హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..!!

 🎻🌹🙏హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿అద్భుతమైన హిమాలయాలకు ఉన్న అందాలు మాటల్లో వర్ణించలేనివి.హిమాలయాల్లో పర్యటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.


🌸మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది.హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని విధంగా అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి.


🌿హిమాలయాలు అంటేనే గుర్తొచ్చేవి మానస సరోవరం, కైలాష్, అమర్ నాథ్ మొదలైన పవిత్ర స్థలాలు.ఇవి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన హిమాలయాల్లో రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి.


🌸హిమాలయాల్లోని ఈ రహస్యాలను సైన్స్ కూడా ఇప్పటి వరకు ఛేదించలేకపోయింది.ఈ పనిలో కూడా శాస్త్రవేత్తలు విజయం సాధించలేకపోయారు.అలాంటి రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


🌹1) ప్రపంచంలో ఉన్న పెద్ద సరస్సుల్లో గురుభోంగ్ మార్ సరస్సు ఒకటి.🌹


🌿ఈ సరస్సు సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో, టెస్టా నదితో కలిసి ఉంటుంది.


🌸కంచనగంగా పర్వతం పక్కనే ఇది ఉంటుంది.ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.

ఈ సరస్సులోని నీరు చలికాలంలో కూడా గడ్డ కట్టవు.దీనికి ఓ కారణం ఉంది.


🌿ఆ సరస్సు ఎప్పుడూ గడ్డ కట్టి ఉండటంతో ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలను గురు పద్మ సాంబవ అనే ట్రైబల్ దేవుడు చూస్తాడు.


🌸దీంతో తన వద్ద ఉన్న ఒక ఆయుధంతో సరస్సులోని ఒక ప్రదేశంలో టచ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆప్రదేశంలో నీరు గడ్డకట్టకుండా ఉంటాయి.దీంతో అక్కడి ప్రజల నీటి కష్టాలు తీరుతాయి.

ఆ నీరు మైనస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా గడ్డ కట్టవు.


🌹2 ) జ్ఞానగంజ్ అనేది ఓ సిద్ధ ఆశ్రమం.🌹


🌿ఈ ఆశ్రమంలో ఉండేవారికి చావు అనేది ఉండదట.

ఇక్కడ ఉండే వారు గాలిని పీల్చుకుని జీవిస్తుంటారు.అయితే ఈ ప్రదేశం అందరికీ కనబడదు.


🌸దేవుడి మీద నమ్మకం ఉండి, ఎవరికీ ద్రోహం చేయకుండా, అందరి మంచి కోరుకునే వారికి మాత్రమే ఈ ప్రదేశం కనిపిస్తుంది.అక్కడ ఉండే యోగులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి.


🌿వారు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతామో కూడా చెప్పగలరు.మన పూర్వం కూడా చెప్పగలరట.


🌹3 )రూప్ కాండ్ సరస్సు:🌹


🌸ఈ సరస్సుకు అస్థి పంజరాల గుట్ట అని కూడా అంటారు.ఇక్కడ పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తాయి.


🌿అయితే అవి ఎవరివి అనేది ఇంకా రహస్యంగానే ఉంది.కొంత మంది అవి రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారివి అంటారు.


🌸వీరంతా రాజ కుటుంబానికి చెందిన వారని, ఒక దేవత శాపం కారణంగా ఇలా మరణించారని మరికొందరు చెబుతారు.దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

ఇవి ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.


🌹4 ) గ్యాంగ్ ఖార్ ప్యునేసం:🌹


🌿ఇది ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం.ఇప్పటి వరకు ఎవరూ ఈ పర్వత శిఖరాన్ని చేరుకోలేదు.

ఈ పర్వతం భూటాన్ లో ఉంది.


🌸ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించకపోవడంతో దీనిని ఒక రహస్య ప్రదేశంగా పిలుస్తున్నారు.

భూటానీస్ లు ఈ ప్రాంతాన్ని దేవుళ్లు, యతిలు సహా అనేక పౌరాణిక జీవాలకు నిలయంగా నమ్ముతారు.


🌿ఇక్కడ అనేక వింత సంఘటనలు, వర్ణించలేని శబ్ధాలు, విచిత్రమైన కాంతులు ఏర్పడుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే వారు చెబుతారు.


🌹5 ) మౌంట్ కైలాష్:🌹


🌸మౌంట్ కైలాష్ అనేది హిమాలయాల్లోనే వింతైన ప్రదేశం.ఇక్కడి నుంచే ప్రపంచ మొదలవుతుందని చెబుతారు.


🌿హిందువులు ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడని నమ్ముతారు.ఇది సముద్ర మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో ఉంటుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

💫 శాపవిమోచనం 🎊

 💫 శాపవిమోచనం  🎊

➖➖➖➖➖➖➖✍️

-(అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం - పుణ్యచరిత్ర)

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


🪷 ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యమూ పరమశివుని అర్చించే నిమిత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు.


🪷 ఇలావుండగా, ఒకనాడు 'కళాధరుడు', 'కాంతిశాలి' అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆపూలవనం చూసి, అబ్బురపడి మనసునిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలను తుంచి, వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. అలికిడికి కుటీరం నుండి బయటకువచ్చిన దూర్వాసుడు జరుగుతున్నది చూసి కోపంపట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపంపెట్టాడు.


🪷 తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచనమీయమనీ గంధర్వులు చేసిన అభ్యర్ధనలకు శాంతించిన దూర్వాసుడు... 'అరుణగిరి' ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరు' అని విమోచనమార్గం అనుగ్రహించాడు.


🪷 ఫలితంగా... ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరిమృగం) గాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. 


🪷 ఆదేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు ఆ గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. రాజైనవాడు వినోదంకోసం, అప్రమత్తత పెంచుకోవడం కోసం ఒంటరిగా అడవులకు వెళ్ళడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగాకమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజాశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. అప్పటికి 'అరుణగిరి' నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగైవుండేది. అలాంటి ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికై అడవిమృగాల కోసం  వెదకసాగాడు. ఎప్పటికో మధ్యాహ్నం దాటిపోయి, వేసారి వెనుదిరుగుదామ అనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిలమెరిసే కళ్ళతోదాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆపిల్లి, నేర్పుగా తప్పించుకుని కనిపించి, కనుమరుగౌతూ గిరిని చుట్టుముట్టి పరుగిడసాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా, ప్రదక్షిణం పూర్తికావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపైనించి దిగడంతో అతని గుర్రంకూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ యిరువురు గంధర్వులు బయటకురాగా అదేక్షణంలో రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నించి వచ్చి ఆగింది.


🪷 ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్యపురుషులను ఆపి, "సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింది" అని ప్రార్ధించగా వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి...


🪷 "రాజా ! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తూ ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరిరూపంగా వెలసివున్నాడు. భక్తితోతప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజూ ఉదయాన్నే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. అటువంటిగిరిని ప్రదక్షిణం చేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాపవిమోచనమైంది" అని అన్నారు.


🪷 వెంటనే రాజు అంజలి ఘటించి.. "మహాత్మ్యమైన ఈ గిరిని మీతోపాటే ప్రదక్షిణం చేసిన నాకు ఏఫలితమూ కలగని కారణమేమిటి ? తెలుపవలసింది" అని వినయంగా అర్దించగా.. 


🪷 "రాజా ! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయరాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్రపదవినైనా పొందగలరు" అని వివరించి, గంధర్వులు సెలవుతీసుకొని విమానం అధిరోహించి తమలోకాలకు వెళ్ళిపోయారు.


🪷 ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి, రాజ్యాన్ని తరువాతివారికి ఒప్పజెప్పి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాలపాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞానతేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడంవల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలూ భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచి, తనకి అహంకార రహిత శాశ్వత సాయుజ్య మీయవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు.


*_🪷 నేడు 'అరుణాచలం' అని పేరుబడ్డ అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. కోరికలీడేర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. నేటి ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు. (సుమారు 14 కి.మీ) అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది.

[4:58 pm, 18/07/2023] Satyam Sivam Group: ఈదారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైనవాటిలో కొన్ని ఆకాలంలో అతను నిర్మించినవే. వీటిలో దుర్వాస మహాముని ఆలయం కూడా మనకు కనిపిస్తుంది.!_*


ఓం అరుణాచలేశ్వరాయ నమః