4, ఫిబ్రవరి 2024, ఆదివారం

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

ఏది మాట్లాడినా, వింటున్న మనసు యొక్క సూక్ష్మ తలంలో అలల రేఖల రూపంలో ముద్రింపబడుతుంది. శక్తి ప్రవాహాల రూపంలో మేల్కొంటుంది. దాని ముద్రలు ఏర్పడతాయి. ధ్వని తరంగాలు మరొక భాగాన్ని దాటినప్పుడు, అక్కడ త్రిభుజాలు, చతుర్బుజాలు, వృత్తాలు, పంచబుజి, బిందువులు మొదలైనవి ఏర్పడతాయి. మెదడు యొక్క సూక్ష్మ కేంద్రాలను ప్రబావితం చేసే సమాధి యొక్క ఉన్నత స్థితిలో అనేక మంత్రాలు స్వీకరించడబతాయి. ఇది సైన్స్. ఇది కొత్త విషయం కాదు. ఉదాహరణకు గాయత్రీ మంత్రం ఉంది... ఇందులో 24 అక్షరాలు ఉన్నాయి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.. ఈ అక్షరాలలో చాలా శబ్దాలు ఉన్నాయి. వీటి నుంచి అనేక రకాల ప్రీక్వెన్సీ వేగ ప్రవాహాలు ఉద్భవిస్తాయి అవి అన్ని పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.. మనుషుల మనస్సు, శరీరం, భావోద్వేగాలను కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రబావితం చేస్తాయి. చెరువులోకి ఒక రాయి విసిరినప్పుడు నీటిలో అలలు ఎగసిపడటం వల్ల కంపనం ఏర్పడి క్రమంగా విస్తరిస్తుంది. ఈ కంపనం నీటిలోని ప్రతి అణువును కంపించేలా చేస్తుంది. అదే విధంగా, మాట్లాడే మాటలు, మంత్రాలు వాతావరణంలో ఒక కంపనం సృష్టిస్తాయి ఆ కంపనం చాలా మంది వ్యక్తుల మనసులలో అల రూపంలో సూక్ష్మంగా ప్రతిబింబిస్తుంది. మంత్రం యొక్క శక్తివంతమైన శబ్దం మన అంతర్గత మనసు యొక్క పాత్రపై చెరగని ప్రభావాన్ని చూపుతుంది. ఇది మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి