20, డిసెంబర్ 2024, శుక్రవారం

స్వామినారాయణ్ జీవిత చరిత్ర

 

 స్వామినారాయణ్ జీవిత చరిత్ర

స్వామి నారాయణ్ లేదా సహజానంద్ స్వామి గా పిలవబడే ఈయన ఒక యోగి మరియు సన్యాసిగా తన జీవితాన్ని గడిపారు. తన జీవిత కాలంలో హిందూ ధర్మం యొక్క భోదననాలను బోధించేవారు. ధర్మం, అహింస, బ్రహ్మఅచర్యం అనే అంశాలపై ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవారు.      

స్వామి నారాయణ్ఉద్ధవ్ సంప్రదాయకి నాయకత్వం కూడా  వహించారు. నాయకత్వం తన గురువు స్వామి రామానంద్ చనిపోయిన తర్వాత అందచేయటం జరిగింది.   బ్రిటిష్ రాజ్ తో కూడా స్వామి నారాయణ్ గారి చాలా మంచి సంభందాలు ఉండేవి. హిందువులు అని కాకుండా ఇస్లాం మరియు జోరాస్ట్రియన్ మతం వారు కూడా వీరిని అనుసరించే వారు

బాల్యం

స్వామినారాయణ్ 3 April 1781 సంవత్సరంలో chhapaiya అనే ఉత్తరప్రదేశ్ లోని గ్రామంలో హరిప్రసాద్ పాండే, ప్రేమవతి పాండే అనే దంపతులకు జన్మించారు. సమయంలో స్వామినారాయణ్ పేరు ఘనశ్యామ్ పాండే గా పెట్టడం జరిగింది. స్వామి నారాయణ్ జన్మించిన రోజే రామ నవమి కావటం కూడా చాలా మంచిది అని అనుకుంటారు.     

స్వామి నారాయణ్ కేవలం 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గ్రంధాలూ, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం లను నేర్చుకోవటం జరిగింది.స్వామినారాయణ్ తల్లి తండ్రులు చనిపోయిన తరవాత 1792 సంవత్సరంలో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు  ఇల్లు వదిలినీలకంఠ్ వార్నిపేరుతో బయలుదేరారు.  

ఇంటి నుంచి బయలు దేరిన స్వామి నారాయణ తన మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక ఆశ్రమం ను వెతకటం ప్రారంభించారు.

వేదాంతం, సమాఖ్య, యోగ, మరియు పాంచరాత్ర లాంటి తత్వ శాస్త్రాలను  వివరించే మంచి గురువును వెతకటం ప్రారంభించారు.

జీవా అంటే ఏమిటి?

ఈశ్వర అంటే ఏమిటి?

మాయ అంటే ఏమిటి?

బ్రాహ్మణ అంటే ఏమిటి?

పరబ్రహ్మణ అంటే ఏమిటి?

5 ప్రశ్నలకు కూడా సమాధానం వెతకటం ప్రారంభించారు.  

రామానంద స్వామి ను కలవటం

సంవత్సరాల సుధీర్గ ప్రయాణం తరవాత గుజరాత్ లోని ఝనాగఢ్ జిల్లా కి చేరుకున్నారు, అక్కడ ముక్తనంద స్వామి ని కలుసుకున్నారు. ముక్తనంద స్వామి స్వామినారాయణ్ మనసులో ఉన్న 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ముక్తనంద స్వామి యొక్క గురువు అయిన రామానంద్ స్వామి ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారుస్వామి నారాయణ్ వయస్సు 21 సంవత్సరాలు అయినప్పుడు రామానంద్ స్వామి తన పేరు ను నీలకంఠ పేరు నుంచి సహజానంద్ స్వామి అని పేరు పెట్టారు. రామానంద్ స్వామి తాను మొదలుపెట్టిన ఉద్దవ్ సంప్రదాయ కి స్వామి నారాయణ్ ను కూడా నాయకునిగా నియంనుంచారు.   

రామానంద్ స్వామి చనిపోయిన తరవాత ఉద్దవ్ సంప్రదాయ ను స్వామినారాయణ్ సంప్రదాయ గా మార్చటం జరిగింది. స్వామి నారాయణ్ చేసే చమత్కారాలు చూసి ప్రజలు తాను ఒక భగవంతుడి రూపం అనుకునేవారు.   

గుజరాత్ లో స్వామి నారాయణ్ చేసిన మంచి మార్పులు

స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చి నప్పుడు దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చాలా ఎక్కువగా ఉండేవి. సమయంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం రకమైన నేరాలను అదుపు చేయలేక పోయింది. స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చిన తరవాత తన బోధనలను విని చాలా మంది నేరస్తులు తమ నేర జీవితం వదిలి మంచి జీవితాన్ని ప్రారంభించారు మార్పుని చూసి ప్రభుత్వం స్వామి నారాయణ్ ను చాలా మెచ్చుకుంది.  

స్వామి నారాయణ్ మహిళలకు విద్య చాలా ముఖ్యమని చెప్పేవారు. రోజుల్లో చాలా మంది మహిళలకు చదువు ఎందుకని ప్రశ్నించిన స్వామి నారాయణ్ మాత్రం మహిళలకు చదువు ముఖ్యమని చెప్పేవారు. స్వామి నారాయణ్ సమయంలో అక్షరాస్యత చాలా బాగా పెరిగింది.      

స్వామి నారాయణ్ కుల వ్యవస్థ ను కూడా రద్దు చేయాలనీ అనుకున్నారు. కరువు సమయాలలో పేద మరియు తక్కువ కులాల వారిని ఆదుకునే వారు, వారికి భోజన వసతి కలిపించేవారు. సమాజం లోని వివిధ రకాల ప్రజలతో డబ్బుని సమకూర్చి పేదలలో పంచేవారు.       

స్వామి నారాయణ్ వేరే మతస్తులైన షియా ముస్లిం లను కూడా తమ తో పటు ఉండటానికి ప్రోత్త్సహించే వారు

స్వామి నారాయణ్ బ్రాహ్మణులు యజ్ఞాలు చేసే సమయంలో ఇచ్చే జంతువుల బలి ను కూడా నిందించే వారు. అహింస మార్గాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాలని జంతు హింస మానుకోవాలని అని చేప్పేవారు. తన అనుచరులను శాఖాహారం మాత్రమే తినాలని మాంసాహారం మానుకోవాలి అని సలహా ఇచ్చే వారు.     

స్వామి నారాయణ్ చేసే మంచి పనులను మరియు సమాజంలో తెచ్చే మార్పులను మహ్మత్మా గాంధి సైతం మెచ్చుకున్నారు. చట్టం ద్వారా కూడా వీలుకాని మార్పులను స్వామి నారాయణ్ గారు చేసారని పొగిడారు.   

మరణం

1830 సంవత్సరంలో తాను ఇక చనిపోతాడని తన అనుచరులను పిలిచి చెప్పారు  ఇలా చెప్పిన తరవాత 1 జూన్ 1830 లో మరణించడం జరిగింది.  

తాను చనిపోవటానికి ముందు తన తర్వాత ఎవరు తన స్థానాన్ని కోనసాగించాలన్న విషయాలను స్పష్టంగా చెప్పారు. చాలా వరకు బాధ్యతలు తన భందువులకే ఇచ్చారు

స్వామి నారాయణ్ మొదటి సారి నిర్మించిన మందిరం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన 500 ఎకరాలలో నిర్మిచడం జరిగింది. స్వామి నారాయణ్ తన జీవిత కాలంలో 6 అతి పెద్ద మందిర నిర్మాణాలు కూడా చేసారు. స్వామి నారాయణ్ అనుచరులు తనను అనుసరించే వారు క్రమ క్రమంగా పెరుగుతూ పోయారు. చాలా మంది తాను నారాయణ స్వామి అవతారం అని అనుకునే వారు, మరికొంత మంది మాత్రం తాను కృష్ణ భగవంతుడి అవతారం అని అనుకునేవారు.